Manipur : మణిపూర్లో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్
Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని నెలల తరబడి ఈ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం.. మణిపూర్ కమాండోను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఎస్బిఐ మోరే సమీపంలోని భద్రతా పోస్ట్పై ఉగ్రవాదులు బాంబులు విసిరి కాల్పులు జరిపారని, ఆ తర్వాత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పోలీసులు తెలిపారు.
ఒక పోలీసు అధికారి హత్యకు సంబంధించి సరిహద్దు పట్టణంలో ఇద్దరు అనుమానితులను రాష్ట్ర బలగాలు అరెస్టు చేశాయి. దీంతో 48 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు భద్రతా దళాల పోస్ట్పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. జనవరి 16 అర్ధరాత్రి 12 నుండి తెంగ్నౌపాల్లో పూర్తి కర్ఫ్యూ విధించింది. ఇదిలా ఉండగా, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్ గ్రామంలో గ్రామ వాలంటీర్లు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్లు ఒక నివేదిక తెలిపింది.
Also Read
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
Read Also:Krishna Bridge: వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
కేంద్ర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత దాడి చేసినవారు కాల్పులు నిలిపివేశారని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డిపిఓ) సి ఆనంద్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ఫిలిప్ ఖోంగ్సాయి, హేమోఖోలాల్ మేట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ భద్రతా సిబ్బంది వాహనాలపై కాల్పులు జరపడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ మోరే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు అనుమానితులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు మోరే పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారని అధికారులు తెలిపారు. కుకి ఇన్పి తెంగ్నౌపాల్ (KIT), చురచంద్పూర్ జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF), కాంగ్పోక్పి జిల్లాకు చెందిన గిరిజన ఐక్యత కమిటీ (COTU) వీరిద్దరి అరెస్టును ఖండించాయి.
తాజావార్తలు
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
-
TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
-
Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!