Manipur : మణిపూర్లో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని నెలల తరబడి ఈ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం.. మణిపూర్ కమాండోను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఎస్బిఐ మోరే సమీపంలోని భద్రతా పోస్ట్పై ఉగ్రవాదులు బాంబులు విసిరి కాల్పులు జరిపారని, ఆ తర్వాత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పోలీసులు తెలిపారు.
ఒక పోలీసు అధికారి హత్యకు సంబంధించి సరిహద్దు పట్టణంలో ఇద్దరు అనుమానితులను రాష్ట్ర బలగాలు అరెస్టు చేశాయి. దీంతో 48 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు భద్రతా దళాల పోస్ట్పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. జనవరి 16 అర్ధరాత్రి 12 నుండి తెంగ్నౌపాల్లో పూర్తి కర్ఫ్యూ విధించింది. ఇదిలా ఉండగా, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్ గ్రామంలో గ్రామ వాలంటీర్లు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్లు ఒక నివేదిక తెలిపింది.
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
Read Also:Krishna Bridge: వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
కేంద్ర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత దాడి చేసినవారు కాల్పులు నిలిపివేశారని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డిపిఓ) సి ఆనంద్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ఫిలిప్ ఖోంగ్సాయి, హేమోఖోలాల్ మేట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ భద్రతా సిబ్బంది వాహనాలపై కాల్పులు జరపడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ మోరే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు అనుమానితులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు మోరే పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారని అధికారులు తెలిపారు. కుకి ఇన్పి తెంగ్నౌపాల్ (KIT), చురచంద్పూర్ జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF), కాంగ్పోక్పి జిల్లాకు చెందిన గిరిజన ఐక్యత కమిటీ (COTU) వీరిద్దరి అరెస్టును ఖండించాయి.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!