Manipur : మణిపూర్లో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని నెలల తరబడి ఈ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం.. మణిపూర్ కమాండోను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఎస్బిఐ మోరే సమీపంలోని భద్రతా పోస్ట్పై ఉగ్రవాదులు బాంబులు విసిరి కాల్పులు జరిపారని, ఆ తర్వాత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పోలీసులు తెలిపారు.
ఒక పోలీసు అధికారి హత్యకు సంబంధించి సరిహద్దు పట్టణంలో ఇద్దరు అనుమానితులను రాష్ట్ర బలగాలు అరెస్టు చేశాయి. దీంతో 48 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు భద్రతా దళాల పోస్ట్పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. జనవరి 16 అర్ధరాత్రి 12 నుండి తెంగ్నౌపాల్లో పూర్తి కర్ఫ్యూ విధించింది. ఇదిలా ఉండగా, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్ గ్రామంలో గ్రామ వాలంటీర్లు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్లు ఒక నివేదిక తెలిపింది.
Also Read
- iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
Read Also:Krishna Bridge: వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
కేంద్ర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత దాడి చేసినవారు కాల్పులు నిలిపివేశారని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డిపిఓ) సి ఆనంద్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ఫిలిప్ ఖోంగ్సాయి, హేమోఖోలాల్ మేట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ భద్రతా సిబ్బంది వాహనాలపై కాల్పులు జరపడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ మోరే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు అనుమానితులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు మోరే పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారని అధికారులు తెలిపారు. కుకి ఇన్పి తెంగ్నౌపాల్ (KIT), చురచంద్పూర్ జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF), కాంగ్పోక్పి జిల్లాకు చెందిన గిరిజన ఐక్యత కమిటీ (COTU) వీరిద్దరి అరెస్టును ఖండించాయి.
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!