Manipur : మణిపూర్లో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని నెలల తరబడి ఈ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం.. మణిపూర్ కమాండోను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఎస్బిఐ మోరే సమీపంలోని భద్రతా పోస్ట్పై ఉగ్రవాదులు బాంబులు విసిరి కాల్పులు జరిపారని, ఆ తర్వాత భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పోలీసులు తెలిపారు.
ఒక పోలీసు అధికారి హత్యకు సంబంధించి సరిహద్దు పట్టణంలో ఇద్దరు అనుమానితులను రాష్ట్ర బలగాలు అరెస్టు చేశాయి. దీంతో 48 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు భద్రతా దళాల పోస్ట్పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. జనవరి 16 అర్ధరాత్రి 12 నుండి తెంగ్నౌపాల్లో పూర్తి కర్ఫ్యూ విధించింది. ఇదిలా ఉండగా, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్ గ్రామంలో గ్రామ వాలంటీర్లు, అనుమానిత కుకీ ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్లు ఒక నివేదిక తెలిపింది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Read Also:Krishna Bridge: వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
కేంద్ర భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత దాడి చేసినవారు కాల్పులు నిలిపివేశారని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డిపిఓ) సి ఆనంద్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ఫిలిప్ ఖోంగ్సాయి, హేమోఖోలాల్ మేట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ భద్రతా సిబ్బంది వాహనాలపై కాల్పులు జరపడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ మోరే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు అనుమానితులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు మోరే పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారని అధికారులు తెలిపారు. కుకి ఇన్పి తెంగ్నౌపాల్ (KIT), చురచంద్పూర్ జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF), కాంగ్పోక్పి జిల్లాకు చెందిన గిరిజన ఐక్యత కమిటీ (COTU) వీరిద్దరి అరెస్టును ఖండించాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!