Madhyapradesh: మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన.. కదిలే కారులో బలవంతంగా పాదాలు నాకించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు.. కదిలే కారులో అతడిని చితకబాది బలవంతంగా అతడితో పాదాలు నాకించి వికృతంగా ప్రవర్తించారు. కదులుతున్న వాహనంలో ఓ వ్యక్తి పాదాలను మరో వ్యక్తి నాకుతున్నట్లు కనిపించిన వీడియో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని దాబ్రా పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
Also Read: Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
Also Read
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో నిందితులు బాధితుడి ముఖంపై పదేపదే కొట్టారు. నిందితులు మాటలతో దుర్భాషలాడారు. బాధితుడిని కదులుతున్న కారులో ‘గోలు గుర్జర్ తండ్రి’ అని చెప్పాలని బలవంతం చేశారు. ఓ వ్యక్తి చాలాసార్లు చెప్పుతో కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇద్దరు నిందితులు అతడితో బలవంతంగా తమ పాదాలను నాకించారు. ఈ తతంగాన్ని కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో కాస్తా వివాదాస్పదంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులు అతడిపై ఎందుకు దాడి చేశారన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
Also Read: Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
శుక్రవారం సాయంత్రం వీడియో వైరల్గా మారిందని, దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని దబ్రా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) వివేక్ కుమార్ శర్మ తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ దండోటియా దబ్రా ఈ వీడియోను ధ్రువీకరంచారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు నిబంధనల ప్రకారం కిడ్నాప్, దాడి కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్గా మారిన కొద్ది రోజులకే ఈ షాకింగ్ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడు ప్రవేశ్ శుక్లాను గురువారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!