Gujarat: ఓటింగ్ ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షప్రసారం.. రీపోలింగ్కు ఈసీ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Goes Live On Instagram Inside Gujarat Polling Station, Repolling Ordered: గుజరాత్లోని దాహోద్ లోక్సభ స్థానం పరిధిలోని పోలింగ్ స్టేషన్లో మే 11న తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. దానికి కారణం ఏంటంటే.. ఓ వ్యక్తి ఓటింగ్ను ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షప్రసారం చేయడమే. ఓ వ్యక్తి మే 7న ఓటింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేశాడని, దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారిందని అధికారి గురువారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులతో పాటు ఒక పోలీసు కానిస్టేబుల్తో సహా నలుగురు ఎన్నికల అధికారులను సస్పెండ్ చేసినట్లు గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మహిసాగర్ జిల్లా సంత్రంపూర్ తాలూకా పార్థంపూర్ పోలింగ్ కేంద్రంలో జరిగిన అవకతవకలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఓటింగ్ను రద్దు చేసిందని సీఈవో తెలిపారు.
Read Also: Minor Case: మైనర్పై జరిగిన రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు..
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
అవకతవకలు జరిగిన వెంటనే సీఈవో ఘటనకు సంబంధించి ఆర్వో నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 58, సబ్ సెక్షన్ 2 ప్రకారం మే 7న పోలింగ్ స్టేషన్లో జరిగిన పోలింగ్ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నివేదిక పంపింది. మే 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య పోలింగ్ కేంద్రంలో తాజా పోలింగ్ జరగాల్సి ఉందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక పోలీసు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో మంగళవారం 25 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సూరత్లో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు.
Read Also: Allahabad High Court: వివాహం తర్వాత “లివ్-ఇన్ రిలేషన్షిప్”ని ఇస్లాం అనుమతించదు..
వైరల్ వీడియో కాపీని సమర్పించి “బూత్ క్యాప్చరింగ్”, “బోగస్ ఓటింగ్” గురించి ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసి.. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. నిందితుడు విజయ్ భాభోర్ ఐదు నిమిషాల పాటు పోలింగ్ బూత్లో ఉండి, ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్ష ప్రసారం చేసాడు. బోగస్ ఓటింగ్ను ఆశ్రయిస్తూ మరో ఇద్దరు ఎలక్టర్ల తరపున ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభా తవియాడ్ ఉన్నారు. ఆమె ప్రస్తుత ఎంపీ జస్వంత్సింగ్ భాభోర్పై పోటీ పడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ‘బూత్ క్యాప్చరింగ్’ వీడియోను ప్రసారం చేసిన వ్యక్తి స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడని కాంగ్రెస్ పేర్కొంది. వీడియోలో విజయ్ భాభోర్ కెమెరాను ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్), వీవీప్యాట్(ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) మెషిన్పై ఫోకస్ చేసి, తనను బయటకు వెళ్లమని అడిగినప్పుడు కూడా ఎన్నికల అధికారి నుంచి ఐదు నుండి పది నిమిషాలు కోరుతున్నట్లు చూపబడింది. “బీజేపీ మాత్రమే ఇక్కడ పని చేస్తుంది” అని కూడా భభోర్ చెప్పినట్లు తెలుస్తోంది. అతని సహచరుడు కూడా వీడియోలో కనిపించాడు. అనంతరం బోగస్ ఓటింగ్ ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!