Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!
- పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి
- ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఘటన
- దాడిలో పఠాన్ అనే వ్యక్తి మృతి
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిపై బాలుడు పదే పదే కత్తితో దాడికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు పాల్పడుతుండగా.. అక్కడే ఉన్న కొంతమంది ఆపలేకపోయారు. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ దాడికి సంబంధించి అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. మృతుడు అహ్మద్ పఠాన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఓ మహిళ సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటన ఆగస్ట్ 8న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..
Also Read
- UP: యూపీలో బక్రీద్ రోజున హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
శివాజీ నగర్లోని రోడ్డుపై బాధితుడు పఠాన్ నిలబడి ఉండగా.. ఒక్కసారిగా మైనర్ బాలుడితో సహా నలుగురు అతనిపై పడ్డారు. ఆ తర్వాత బాలుడు పఠాన్పై ఆవేశంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని ఆపుదామని వచ్చిన బాటసారులను కూడా బాలుడు బెదిరించాడు. ఈ క్రమంలో.. పఠాన్ పై మైనర్ బాలుడు పలుసార్లు దాడి చేస్తూనే ఉన్నాడు. కాగా.. మృతుడు, నిందితులు ఒకరికొకరు తెలుసని.. రెండు వారాల క్రితం వారి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!
ఈ క్రమంలో పఠాన్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో థానేలోని రాబోడి ప్రాంతంలో పాత గొడవలు కారణంగా 40 ఏళ్ల వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవ్వడంతో.. దుకాణ యజమానులు తమ సంస్థలను మూసివేశారు. బాధితుడు వసీం ఖురేషీ ఛాతీ, ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
- Tags
- attack
- Crime News
- dies
- Man
- minor
తాజావార్తలు
-
UP: యూపీలో బక్రీద్ రోజున హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
-
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
-
East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
-
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్లో మాస్ ర్యాగింగ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..