TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- టీఎంసీ సంక్షోభం నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం..
- పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఫ్రీజ్..
- మమతా, రీటబ్రత వర్గాలకు కొత్త పేర్లు, గుర్తులు..
- ఉప ఎన్నికల్లో ఈ గుర్తులతోనే పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గపోరు కీలక మలుపు తీసుకుంది. పార్టీకి చెందిన అసలు పేరు, ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీ్ చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించింది. ఇక తిరుగుబాటు వర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్/కవర్’ గుర్తును ఇచ్చింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ గుర్తులపైనే పోటీ చేయబోతున్నారు.
దీనికి ముందు తృణమూల్ కాంగ్రెస్కు మూడు దశాబ్ధాలుగా ఉన్న ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, దాని రెండు ఆకుల గుర్తును ఈసీ ఫ్రీజ్ చేసింది. దీంతో రెండు వర్గాలు ఈ పేరు, గుర్తు వాడకుండా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమతా వర్గం ఈసీ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని విమర్శించారు. మరోవైపు తిరుగుబాటు వర్గం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. తమకు ‘పువ్వులు-గడ్డి’ గుర్తే కావాలని, తుది నిర్ణయం తమకు పార్టీ పేరు, గుర్తును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర ఓటమి తర్వాత, తృణమూల్ రెండుగా విడిపోయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 58 మంది రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. వీరికి అసెంబ్లీ స్పీకర్ గుర్తింపు కూడా లభించింది. ఇదిలా ఉంటే, లోక్సభ ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు. 20 మంది ఎంపీలు సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో NCPIలో చేరి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మద్దతు ప్రకటించారు.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..