Mamata Banerjee: మమతా బెనర్జీ కీలక ప్రకటన.. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో తాను ముఖ్య పాత్ర పోషించానన్నారు. కూటమి పేరు కూడా తానే పెట్టానని చెప్పారు.
READ MORE: AP Elections 2024: నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ.. హింసాత్మక ఘటనలపై రిపోర్ట్..!
Also Read
- YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
పశ్చిమ బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “బీజేపీ పార్టీ దొంగలతో నిండి ఉంది. 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కానీ అది జరగదని ప్రజలు అంటున్నారు. బీజేపీ నిండా దొంగలే ఉన్నారని.. దేశం మొత్తం అర్థం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మేం (టీఎంసీ) బయటి నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తాం. (పశ్చిమ) బెంగాల్లో మా తల్లులు, సోదరీమణులు ఎన్నటికీ సమస్యలు ఎదుర్కోకుండా, 100 రోజుల ఉపాధి పథకంలో పని చేసే వారికి కూడా మేము సహాయం చేస్తాం, ”అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సీఏఏ) రద్దు చేస్తామని, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ), యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో నాలుగు దశల ఓటింగ్ పూర్తయి మూడు దశల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో మమత ఈ ప్రకటన చేయడం విశేషం. బెంగాల్లో ప్రతి దశలోనూ ఓటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఐదవ దశలో (మే 20), బంగావ్, బరాక్పూర్, హౌరా, ఉలుబెరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరంబాగ్లలో ఓటింగ్ జరగనుండగా, ఆరో దశలో (మే 25) ఓటింగ్ తమ్లుక్, కంఠి, ఘటల్, ఝార్గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, విష్ణాపూర్ లో పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!