Mallikarjuna Kharge : హైదరాబాద్కు చేరుకున్న ఖర్గే.. స్వాగతం పలికిన సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపా దాస్మున్షీ తదితరులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించగా మిగిలిన 16 స్థానాలకు ఎంపిక చేయాల్సి ఉంది.
పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి రాజీనామా చేసి నాగర్కర్నూల్ టికెట్ ఇవ్వాలని సీఎంకు లేఖ పంపినట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. ఈ సీటు కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్తో పాటు మరికొందరు నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ సీటును వెనుకబడిన తరగతులకు ఇస్తే నగరంలో కాంగ్రెస్కు మద్దతు లభిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా వెనుకబడిన సామాజికవర్గ నేతకే సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ఎస్సీ, ఎస్టీ కోటాలో ఐదు రిజర్వ్డ్ సీట్లకు 50 మంది అభ్యర్థులు టికెట్లు కోరుతున్నారు. నాయకులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు పోటీలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పీసీసీ ఆఫీస్ బేరర్లతో కాంగ్రెస్ వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్గా పవన్ మల్లాది నియమితులయ్యారు. అలాగే, సందేశ్ శింగాల్కర్, సతీష్ మన్నె, సంతోష్ రుద్ర , జక్కని అనిత కో-చైర్మెన్లుగా ఉన్నారు. పార్టీ శిక్షణ కోసం వసీం భాషా , ఆరోన్ మీర్జాలను , విశ్లేషకుడిగా శ్రీకాంత్ కుమ్మరిని నియమించగా, గిరిజా షెట్కార్, నవీన్ పట్టెం సోషల్ మీడియా ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్మున్షీ అనుమతితోనే ఈ నియామకాలు జరిగాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?