Mallikarjuna Kharge : హైదరాబాద్కు చేరుకున్న ఖర్గే.. స్వాగతం పలికిన సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపా దాస్మున్షీ తదితరులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించగా మిగిలిన 16 స్థానాలకు ఎంపిక చేయాల్సి ఉంది.
పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి రాజీనామా చేసి నాగర్కర్నూల్ టికెట్ ఇవ్వాలని సీఎంకు లేఖ పంపినట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. ఈ సీటు కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్తో పాటు మరికొందరు నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ సీటును వెనుకబడిన తరగతులకు ఇస్తే నగరంలో కాంగ్రెస్కు మద్దతు లభిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా వెనుకబడిన సామాజికవర్గ నేతకే సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
ఎస్సీ, ఎస్టీ కోటాలో ఐదు రిజర్వ్డ్ సీట్లకు 50 మంది అభ్యర్థులు టికెట్లు కోరుతున్నారు. నాయకులు, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు పోటీలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పీసీసీ ఆఫీస్ బేరర్లతో కాంగ్రెస్ వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్గా పవన్ మల్లాది నియమితులయ్యారు. అలాగే, సందేశ్ శింగాల్కర్, సతీష్ మన్నె, సంతోష్ రుద్ర , జక్కని అనిత కో-చైర్మెన్లుగా ఉన్నారు. పార్టీ శిక్షణ కోసం వసీం భాషా , ఆరోన్ మీర్జాలను , విశ్లేషకుడిగా శ్రీకాంత్ కుమ్మరిని నియమించగా, గిరిజా షెట్కార్, నవీన్ పట్టెం సోషల్ మీడియా ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్మున్షీ అనుమతితోనే ఈ నియామకాలు జరిగాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?