Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు

Congress Pre

Congress Pre

Congress : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో 96 శాతం పోలింగ్ జరిగింది. 9,900 మంది పీసీసీ ప్రతినిధుల్లో 9,500 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. చిన్న రాష్ట్రాల్లోనూ వందశాతం ఓటింగ్ జరిగినట్టు ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో 87 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సీనియర్ నేత ఖర్గే విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4 గంటల దాకా కొనసాగిందన్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​కేంద్రంలో 100శాతం ఓటింగ్​నమోదైందన్నారు. అన్ని చోట్ల 90శాతానికి పైగా పోలింగ్​ రికార్డయినట్టు వివరించారు. ప్రశాంతయుత వాతావరణంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఈ ఎన్నికలతో చూపించిందన్నారు. ఇది రహస్య ఓటింగ్​అని, ఎవరు.. ఎవరికి ఓటేశారో ఎవరికీ తెలియదని, ఈ విషయంలో భయపడొద్దని మిస్త్రీ తెలిపారు. 19న ఏఐసీసీ ఆఫీస్​లోనే ఓట్ల లెక్కింపు ఉంటుందని, అదే రోజు రిజల్ట్స్​ ప్రకటిస్తామని చెప్పారు. చెల్లని ఓట్లను పక్కనపెట్టేసి.. ఎవరికైతే 50శాతానికి పైగా ఓట్లు నమోదవుతాయో వారే కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఎన్నికవుతారని వివరించారు.

Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్‎తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

ఏఐసీసీ హెడ్​క్వార్టర్​లో ఏర్పాటు చేసిన 68వ పోలింగ్​ బూత్​లో పార్టీ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత బయటికొచ్చిన సోనియా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏండ్ల నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశానని సోనియా గాంధీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, సీనియర్​ లీడర్లు జైరాం రమేశ్, అంబికా సోని, అజయ్​ మాకెన్, వివేక్​తన్ఖాతో పాటు పలువురు నేతలు ఏఐసీసీ హెడ్​క్వార్టర్​లో ఓటేశారు.

Read Also: Fighter jet crashes: భవనంపై కుప్పకూలిన యుద్ధవిమానం.. చెలరేగిన మంటలు

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ సహా సీనియర్ నేతలు ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాబట్టి ఖర్గే ఎన్నిక లాంఛనమేనని చెబుతున్నారు. కాగా, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా గాంధీ కుటుంబం అభిప్రాయాలను కూడా వినాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి పి.చిదరంబరం అన్నారు. గాంధీయేతర నేత పగ్గాలు స్వీకరించినప్పటికీ ఫస్ట్ ఫ్యామిలీ గొంతు మూగబోయినట్టు కాదని స్పష్టం చేశారు. సోనియా ఎప్పటికీ తమకు నాయకురాలేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేర్కొన్నారు.