Sunitha Mahendhar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ప్రజలను వంచిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunitha Mahendhar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయంలో తెరవెనుక లోపాయకారి ఒప్పందం చేసుకొని ప్రజలను వంచిస్తున్నాయని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్పల్లి 121 డివిజన్లో భారీ రోడ్ షో నిర్వహించి.. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసి బీజేపీ అభ్యర్థి ఈటెల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో బయటకు తిట్టుకుంటూ లోపల మాత్రం కలిసి ఉంటారని అన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: CM Revanth Reddy: మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడుని అభినంధించిన సీఎం..
Also Read
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో 'పే లేటర్' సదుపాయం!
తనను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీలతో పాటు ఇండియా కూటమితో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం నుంచి పాంచ్ న్యాయ్ పథకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి మల్కాజిగిరిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని కోరారు. అంతకు ముందు రెయిన్ బో విష్టాలో ఓటర్లతో బ్రేక్ ఫాస్ట్ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ , వినయ్ రెడ్డి, గొట్టిముక్కుల దేశాలు, భీమ్రావు, తూము వేణు, నాగిరెడ్డి, గొట్టిముక్కుల వెంకట్, మేకల రమేష్, సత్యం శ్రీరంగం, గోవింద్ గౌడ్, వినయ్ రెడ్డి, శేరి సతీష్ రెడ్డి, కృష్ణవేణి వెంకటరావు, పుష్ప రెడ్డి, మైఖేల్, కృష్ణంరాజు, అరవింద్ రెడ్డి, మోయిజ్, రఘు, అక్బర్ లక్ష్మణ్, భాష, నాగిరెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!