Sunitha Mahendhar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ప్రజలను వంచిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunitha Mahendhar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయంలో తెరవెనుక లోపాయకారి ఒప్పందం చేసుకొని ప్రజలను వంచిస్తున్నాయని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్పల్లి 121 డివిజన్లో భారీ రోడ్ షో నిర్వహించి.. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసి బీజేపీ అభ్యర్థి ఈటెల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో బయటకు తిట్టుకుంటూ లోపల మాత్రం కలిసి ఉంటారని అన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: CM Revanth Reddy: మంటల్లో ఇరుక్కున్న కార్మికులను కాపాడిన బాలుడుని అభినంధించిన సీఎం..
Also Read
- US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి...
- PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
తనను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీలతో పాటు ఇండియా కూటమితో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం నుంచి పాంచ్ న్యాయ్ పథకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి మల్కాజిగిరిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని కోరారు. అంతకు ముందు రెయిన్ బో విష్టాలో ఓటర్లతో బ్రేక్ ఫాస్ట్ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ , వినయ్ రెడ్డి, గొట్టిముక్కుల దేశాలు, భీమ్రావు, తూము వేణు, నాగిరెడ్డి, గొట్టిముక్కుల వెంకట్, మేకల రమేష్, సత్యం శ్రీరంగం, గోవింద్ గౌడ్, వినయ్ రెడ్డి, శేరి సతీష్ రెడ్డి, కృష్ణవేణి వెంకటరావు, పుష్ప రెడ్డి, మైఖేల్, కృష్ణంరాజు, అరవింద్ రెడ్డి, మోయిజ్, రఘు, అక్బర్ లక్ష్మణ్, భాష, నాగిరెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!