Maldives: భారత్- మాల్దీవుల మధ్య వివాదం.. చైనా పర్యటనకు అధ్యక్షుడు ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Mohammad Muizzu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు. ఇది ఆయనకు మొదటి విదేశీ పర్యటన’.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జూ వెళ్లారు. అధ్యక్షుడు ముయిజ్జూతో పాటు మాల్దీవుల ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా చైనాకు వెళ్లింది. కాగా, మాల్దీవుల( Maldives ) అధ్యక్షుడు ముయిజ్జు వారం రోజుల పాటు చైనా పర్యటనలో ఉండనున్నారు.
Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు కొత్త ఆరోగ్య సమస్య.. ఐపీఎల్ 2024కు దూరం!
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
అయితే, భారతదేశంతో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అంశాన్ని భారత హైకమిషన్ లేవనెత్తడంతో ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది. మాల్దీవులకు ( Maldives ) ప్రత్యామ్నాయ పర్యాటక కేంద్రంగా కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ను చూపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మాల్దీవుకు చెందిన మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు.
Read Also: Warangal: ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి ధరలు తగ్గించారని రైతన్న ఆగ్రహం..
కాగా, మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలు భారతదేశంలో విమర్శలకు దారితీశాయి. పలువురు ప్రముఖులు మాల్దీవులకు వెళ్లకుండా దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కొంత మంది భారతీయులు మాల్దీవులకు (Maldives ) తమ షెడ్యూల్డ్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారనే విషాయాన్ని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?