Malaysia Visa-Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా మలేషియా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు. గతంలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, టర్కీ, జోర్డాన్, ఇరాన్ దేశాలకు మలేషియా ఈ మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి ఈ అవకాశం దక్కింది. అయితే, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం నిన్న (ఆదివారం) అర్థరాత్రి తన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్లో చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుండి 30 రోజుల పాటు చైనా, భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుందన్నారు. అయితే, వీసా మినహాయింపు ఎంతకాలం వర్తిస్తుందో ఆయన వెల్లడించలేదు.
Read Also: Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ఇక, మలేషియాకు వెళ్లే అత్యధిక పర్యాటకులలో చైనా ప్రజలు నాల్గవ స్థానంలో భారతీయులు ఐదవ స్థానంలో ఉన్నారు. మలేషియాకు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు.. ఇందులో చైనా నుండి 4 లక్షల 98 వేల 540 మంది పర్యాటకులు ఉండగా.. భారతదేశం నుండి 2 లక్షల 83 వేల 885 మంది పర్యాటకులు ఉన్నారు. కరోనాకు ముందు 2019 ఇదే కాలంలో చైనా నుండి 15 లక్షల మంది.. భారతదేశం నుండి 3 లక్షల 54 వేల 486 మంది మలేషియాకు వెళ్లారు.
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
దీంతో పర్యటకులను ఆకర్షించేందుకు మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మినహాయింపు పొందిన వారిలో చైనా, భారతీయ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం, చైనా- భారతీయ పౌరులు మలేషియాలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!