Malaysia Visa-Free Entry: భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా మలేషియా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు. గతంలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, టర్కీ, జోర్డాన్, ఇరాన్ దేశాలకు మలేషియా ఈ మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి ఈ అవకాశం దక్కింది. అయితే, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం నిన్న (ఆదివారం) అర్థరాత్రి తన పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్లో చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుండి 30 రోజుల పాటు చైనా, భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుందన్నారు. అయితే, వీసా మినహాయింపు ఎంతకాలం వర్తిస్తుందో ఆయన వెల్లడించలేదు.
Read Also: Indian Railway: రైలులో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..
Also Read
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
- ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
ఇక, మలేషియాకు వెళ్లే అత్యధిక పర్యాటకులలో చైనా ప్రజలు నాల్గవ స్థానంలో భారతీయులు ఐదవ స్థానంలో ఉన్నారు. మలేషియాకు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మలేషియాకు 9.16 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చారు.. ఇందులో చైనా నుండి 4 లక్షల 98 వేల 540 మంది పర్యాటకులు ఉండగా.. భారతదేశం నుండి 2 లక్షల 83 వేల 885 మంది పర్యాటకులు ఉన్నారు. కరోనాకు ముందు 2019 ఇదే కాలంలో చైనా నుండి 15 లక్షల మంది.. భారతదేశం నుండి 3 లక్షల 54 వేల 486 మంది మలేషియాకు వెళ్లారు.
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
దీంతో పర్యటకులను ఆకర్షించేందుకు మలేషియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మినహాయింపు పొందిన వారిలో చైనా, భారతీయ పౌరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం, చైనా- భారతీయ పౌరులు మలేషియాలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తాజావార్తలు
-
Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
-
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
Prithviraj Sukumaran : వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం
-
Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్తో అదిరిపోయే ఫీచర్లు
ట్రెండింగ్
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?