Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆర్. ప్రవీణ్ కుమార్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్లోని నాలుగో అంతస్తులో ప్రవీణ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తోటకుర్తి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృత దేహాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
రాంతి ప్రవీణ్ కుమార్ ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. ఇళ్లకు వెళ్లే వారికి ఔట్ పాస్లు అందజేస్తున్నారు.ప్రవీణ్ కుమార్ తో పాటు అతని స్నేహితులు కూడా ఔట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం ప్రవీణ్ కుమార్ స్నేహితుడు ఔట్ పాస్ తీసుకుని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి ప్రవీణ్ బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి స్నేహితుడు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన సిబ్బంది యూనివర్సిటీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు బీహెచ్లోని ఖాళీ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని అంబులెన్స్లో బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదికి తాళం వేయకుండా ఖాళీగా ఉంచినట్లు మరికొందరు విద్యార్థులు అనుమానిస్తున్నారు.
Also Read
- Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
మృతుడి తల్లి మూడు నెలల కిందటే గుండెపోటుతో మృతి చెందింది. ఇటీవలే తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రవీణ్ మానసికంగా కుంగిపోయాడని ప్రవీణ్ స్నేహితులు చెబుతున్నారు. రెండో పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తండ్రి మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆందోళన వ్యక్తం చేశారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో బబ్లూ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన జాదవ్ బబ్లూ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 13న బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదే నెల 15న లిఖిత అనే విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఈ ఇద్దరి మృతిపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు.
Girls Fight for Selfie: సెల్ఫీ విషయంలో వివాదం.. పొట్టుపొట్టు కొట్టుకున్న యువతులు..
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!