Malavika Mohanan : ప్రొడ్యూసర్లు నమ్మితే.. హీరోయిన్లు కూడా రికార్డులను తిరగరాస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇండస్ట్రీలోని ఒక చేదు నిజంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్గా ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’లో మెరిసిన ఈ భామ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ల మార్కెట్ పట్ల నిర్మాతలు చూపుతున్న వివక్షను ఎండగట్టింది. మన దగ్గర భారీ బడ్జెట్ సినిమాలు అంటే కేవలం హీరోలవే ఎందుకు ఉంటున్నాయని ఆమె ప్రశ్నించింది. హీరోయిన్ మెయిన్ రోల్లో ఉంటే థియేటర్లకు జనాలు రారని, బాక్సాఫీస్ వసూళ్లు ఉండవని ప్రొడ్యూసర్లు ముందే ఒక ఫిక్స్డ్ ఓపీనియన్కు వచ్చేస్తారని, అందుకే ఒక లిమిట్ దాటి ఖర్చు చేయడానికి భయపడుతున్నారని మాళవిక కుండబద్దలు కొట్టింది.
Also Read : Rimi Sen : భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
నిర్మాతలు ధైర్యం చేసి కంటెంట్ను నమ్మితే ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లోక’ను ఆమె ఉదాహరణగా చూపింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ భారీగా ఖర్చు చేశారని, ఫలితంగా ఆ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిందని గుర్తు చేసింది. “కంటెంట్ బాగుండి, ప్రొడ్యూసర్లు నమ్మి అవకాశం ఇస్తే హీరోయిన్లు కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారు” అని మాళవిక తన మనసులోని మాటను బయటపెట్టింది. గతేడాది ‘హృదయపూర్వం’తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుతున్న ధోరణులపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!