Sambani Chandrasekhar: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్
Sambani Chandrasekhar: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ ఇస్తామని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం వెంగళరావు నగర్లో కాంగ్రెస్ హథ్ సే హథ్ జోడో అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంభాని ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలుపుతూ కాంగ్రెస్ కు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంభాని మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని.. పేదరిక నిర్మూలన చేసేందుకే రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సంభాని.
Read Also: Black Magic: క్షుద్ర శక్తులొస్తాయని మంత్రగాడిని బలిచ్చి రక్తం తాగిన శిష్యుడు
Also Read
- NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
- Prabhas - Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
- SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
సర్వమాత సామరస్యం కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. వరంగల్ డిక్లేరేషన్ తూ.చ తప్పకుండా పాటిస్తామన్నారు. కవులు రైతులకు కూడా 15 వేలు ఇస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర వస్తుల ధరలను నియంత్రిస్తామన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేనోడు మహరాష్ట్ర వెళ్లి అక్కడ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తాడంటా అని ఎద్దేవా చేశారు సంభాని. బీఆర్ఎస్ పచ్చి అబద్ధాల పార్టీ అన్నారు.
Read Also:TS Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
బీజేపీ ఓ మతతత్వ పార్టీ దానిని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ హయంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే దానిని బీజేపీ అధికారంలోకి రాగానే రూ.1200 పెంచి పేదలపై పెను ధరాభారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున్న అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆడంబరాలకు తీసుకుపోతుందని తెలంగాణ సర్కారును ఉద్దేశించి ప్రసంగించారు. పేదల మీద పట్టింపు లేని ప్రభుత్వాలు పోవాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని సంభాని చంద్రశేఖర్ అశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!