NTV Telugu Site icon

Mahesh Babu: న్యూయర్ వేడుకల కోసం దుబాయ్‏కు మహేష్… పిక్స్ వైరల్..

Mahesh

Mahesh

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక ప్రతి ఏడాది న్యూయర్ వేడుకల కోసం మహేష్ ఫ్యామిలితో కలిసి దుబాయ్ కు వెళ్తున్నాడు.. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న మహేష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఎయిర్ పోస్ట్ లో మహేష్ బాబు చేయి పట్టుకుని సితార నడుస్తుండగా.. ఆ పక్కనే నమ్రత, గౌతమ్ వెళ్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్‏లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వీరంతా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లారని.. అలాగే అక్కడే న్యూయర్ సెలబ్రెషన్స్ జరుపుకోనున్నారని తెలుస్తోంది..

ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ సైతం తన ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం లో నటిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ లో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కాబోతుంది..