Parliament: పార్లమెంట్లోని అంబేద్కర్, గాంధీ విగ్రహాల స్థానాల్లో మార్పులు.. కాంగ్రెస్ ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దౌర్జన్యపు చర్య అని జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ భవనం ముందు ఉన్న విగ్రహాలను మార్చడం చాలా దారుణమన్నారు.
Read Also: Rahul Gandhi: మోడీ, షా స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు(వీడియో)
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
మరోవైపు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడంతోనే పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం మార్చిందని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షులు పవన్ ఖేరా ఆరోపించారు. ఇక, గుజరాత్లో బీజేపీ అన్ని స్థానాలను గెలవకపోవడంతోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా మరో చోటుకు మార్చారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకవేళ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే దేశ రాజ్యాంగాన్ని కూడా వాళ్లే మార్చేవారంటూ ప్రశ్నించారు.
Read Also: Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
ఇక, పార్లమెంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగానే విగ్రహాలను మార్చామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ల్యాండ్ స్కేపింగ్ ఆధునీకరణ కోసం పార్లమెంట్ విగ్రహాలను ఒకే చోట ఉంచబోతున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాలను పాత పార్లమెంట్ భవనం, పార్లమెంట్ లైబ్రరీ మధ్య ఉన్న గార్డెన్లో ఉంచారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రముఖుల విగ్రహాలన్నీ ఇప్పుడు ఒకే చోటుకు చేరుకున్నాయి. ఇక, కేంద్ర ప్రభుత్వం చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Statues of Chhatrapati Shivaji Maharaj, Mahatma Gandhi, and Dr. Babasaheb Ambedkar have just been removed from their places of prominence in front of the Parliament House. This is atrocious. pic.twitter.com/NA12QjCBAK
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 6, 2024
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!