Parliament: పార్లమెంట్లోని అంబేద్కర్, గాంధీ విగ్రహాల స్థానాల్లో మార్పులు.. కాంగ్రెస్ ఫైర్..!
Congress: ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న దౌర్జన్యపు చర్య అని జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ భవనం ముందు ఉన్న విగ్రహాలను మార్చడం చాలా దారుణమన్నారు.
Read Also: Rahul Gandhi: మోడీ, షా స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు(వీడియో)
Also Read
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
మరోవైపు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడంతోనే పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను కేంద్ర ప్రభుత్వం మార్చిందని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షులు పవన్ ఖేరా ఆరోపించారు. ఇక, గుజరాత్లో బీజేపీ అన్ని స్థానాలను గెలవకపోవడంతోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా మరో చోటుకు మార్చారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకవేళ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే దేశ రాజ్యాంగాన్ని కూడా వాళ్లే మార్చేవారంటూ ప్రశ్నించారు.
Read Also: Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
ఇక, పార్లమెంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగానే విగ్రహాలను మార్చామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ల్యాండ్ స్కేపింగ్ ఆధునీకరణ కోసం పార్లమెంట్ విగ్రహాలను ఒకే చోట ఉంచబోతున్నట్లు తెలిపారు. ఈ విగ్రహాలను పాత పార్లమెంట్ భవనం, పార్లమెంట్ లైబ్రరీ మధ్య ఉన్న గార్డెన్లో ఉంచారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రముఖుల విగ్రహాలన్నీ ఇప్పుడు ఒకే చోటుకు చేరుకున్నాయి. ఇక, కేంద్ర ప్రభుత్వం చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Statues of Chhatrapati Shivaji Maharaj, Mahatma Gandhi, and Dr. Babasaheb Ambedkar have just been removed from their places of prominence in front of the Parliament House. This is atrocious. pic.twitter.com/NA12QjCBAK
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 6, 2024
తాజావార్తలు
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!