Maharashtra: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సర్కారు..
Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది. “ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి”పై దేశ వ్యతిరేక నినాదాలను సహించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. పీఎఫ్ఏ సంస్థపై ఈడీ, సీబీఐ దాడులను నిరసిస్తూ పీఎఫ్ఐ కార్యకర్తలు పుణెలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేశారు. ఈ ఘటనను సీఎం ఏక్నాథ్ షిండే ఖండించారు.
పుణెలో లేవనెత్తిన దేశవ్యతిరేక ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలను ఎంత ఖండించినా సరిపోదని… పోలీసులు తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారన్నారు. వారికి ఆదేశాలను జారీ చేశామన్నారు. కానీ శివాజీ భూమిపై ఇలాంటి నినాదాలు చేస్తే సహించబోమని ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు.
Also Read
पुण्यात ज्या समाजकंटकांनी पाकिस्तान झिंदाबादचे नारे दिले त्या प्रवृत्तीचा करावा तेवढा निषेध कमीच आहे. पोलीस यंत्रणा त्यांच्याविरोधात योग्य ती कारवाई करेलच, पण शिवरायांच्या भूमीत असले नारे अजिबात सहन केले जाणार नाहीत.
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) September 24, 2022
ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని విడిచిపెట్టబోమని హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అన్నారు.నాగ్పూర్లో ఫడ్నవీస్ మాట్లాడుతూ, “మహారాష్ట్రలో లేదా భారతదేశంలో ఎవరైనా ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం చేస్తే, ఆ వ్యక్తిని వదిలిపెట్టరు. వారిపై చర్యలు తీసుకుంటారు, వారు ఎక్కడ ఉన్నా వారిని పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటాం.” అని ఫడ్నవీస్ అన్నారు.
Pune Police takes cognizance of the slogan raised during the PFI protest yesterday and is investigating all slogans raised in the protest: Pune Police https://t.co/77xzeYV1km
— ANI (@ANI) September 24, 2022
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!