Maharashtra: రైల్వే స్టేషన్ల పేర్ల మార్పునకు షిండే సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఓ వైపు తాయిలాలు ప్రకటిస్తూనే.. మరో వైపు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇటీవలే మారాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ పత్రాల్లో తల్లి పేరు ఉండేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ముంబైలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్చాలని షిండే మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బ్రిటీషు కాలం నాటి పేర్లు మార్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక జిల్లా పేరుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యా నగర్గా మార్చాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఉత్తాన్ (భయందర్) మరియు విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర మార్గాన్ని నిర్మించడానికి కేబినెట్ ఆమోదించింది.
ఇక శ్రీనగర్, జమ్మూకాశ్మీర్లో మహారాష్ట్ర భవన్ నిర్మించడానికి 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని షిండే మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీలో గత బడ్జెట్ సెషన్లో పొందుపరిచింది.
ఎనిమిది ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. ప్రతిపాదిత పేర్లలో సర్ జగన్నాథ్ శంకర్ సేథ్, ముంబాదేవి, గిర్గావ్, లాల్బాగ్, డోంగ్రీ, కాలా చౌకీ, మజ్గావ్, తీర్థంకర్ పార్శ్వనాథ్ ఉన్నాయి.
ముంబై సెంట్రల్ అనే పేరు.. వాస్తవానికి బాంబే సెంట్రల్. 1930లో స్టేషన్ను నిర్మించినప్పుడు ఇది నగరానికి కేంద్ర రవాణా కేంద్రంగా పనిచేయాలని ఉద్దేశించబడింది. దీనికి ప్రతిపాదిత పేరు: సర్ జగన్నాథ్ శంకర్ సేథ్
Maharashtra Cabinet has decided to rename 8 Mumbai railway station names which were British Era names. Also, the cabinet has approved to construct a sea link between Uttan (Bhayander) and Virar (Palghar)
— ANI (@ANI) March 13, 2024
Maharashtra cabinet has approved the purchase of 2.5 acres of land in Srinagar, J&K to construct a Maharashtra Bhavan there. The budget proposal for the same was already done in the State budget in the previous budget session of the Maharashtra Assembly.
— ANI (@ANI) March 13, 2024
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి