Buldhana Bus Accident: బుల్దానా బస్సు ప్రమాదం షాకింగ్ నిజాలు.. తప్పతాగి బస్సు నడిపిన డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buldhana Bus Accident: మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది. ఫోరెన్సిక్ నివేదిక (RFSL) ప్రకారం, డ్రైవర్ డానిష్ శరీరంలో ఆల్కహాల్ లిమిట్ కంటే 30శాతం ఎక్కువ ఉన్నట్లు కనుగొనబడింది. ఆ తర్వాత ఈ బస్సు ప్రమాదానికి డ్రైవర్ డానిష్ మాత్రమే బాధ్యత వహించాలని విచారణలో నిర్ధారణకు రావచ్చు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డానిష్, కండక్టర్ అరవింద్ మారుతీ జాదవ్ ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also:Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!
Also Read
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
మహారాష్ట్రలో 100ml రక్తంలో 0.03 లేదా 30mg ఆల్కహాల్ పరిమితి ఉంది. అయితే డ్రైవర్ రక్తంలో 30శాతం ఎక్కువ ఆల్కహాల్ కనుగొనబడింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత దానిని కోర్టులో సమర్పించవచ్చు. తద్వారా నిందితుడైన డ్రైవర్, కండక్టర్లను కఠినంగా శిక్షించవచ్చు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో జూలై 1న సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై స్తంభం, డివైడర్ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. నాగ్పూర్ నుండి ఔరంగాబాద్ మార్గంలో బస్సు మొదట ఇనుప స్తంభాన్ని ఢీకొట్టి, అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. బుల్దానాలో జరిగిన ఈ ప్రమాదం తర్వాత ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా నేతలంతా సంతాపం వ్యక్తం చేయడంతో పాటు పరిహారం ప్రకటించారు.
Read Also:Richest Beggar: జనాలను బిత్తిరోళ్లను చేసిన బిచ్చగాడు.. ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
ఈ ప్రమాదం తర్వాత పోలీసులు సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఇందులో వాహనాల చక్రాల పరిస్థితి, గాలి/నత్రజని పీడనం, అత్యవసర కిటికీల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారా, చెల్లుబాటు అయ్యే పత్రాలు, ఇతర ముఖ్యమైన అంశాలను కూడా తనిఖీ చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!