Buldhana Bus Accident: బుల్దానా బస్సు ప్రమాదం షాకింగ్ నిజాలు.. తప్పతాగి బస్సు నడిపిన డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buldhana Bus Accident: మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది. ఫోరెన్సిక్ నివేదిక (RFSL) ప్రకారం, డ్రైవర్ డానిష్ శరీరంలో ఆల్కహాల్ లిమిట్ కంటే 30శాతం ఎక్కువ ఉన్నట్లు కనుగొనబడింది. ఆ తర్వాత ఈ బస్సు ప్రమాదానికి డ్రైవర్ డానిష్ మాత్రమే బాధ్యత వహించాలని విచారణలో నిర్ధారణకు రావచ్చు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డానిష్, కండక్టర్ అరవింద్ మారుతీ జాదవ్ ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also:Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
మహారాష్ట్రలో 100ml రక్తంలో 0.03 లేదా 30mg ఆల్కహాల్ పరిమితి ఉంది. అయితే డ్రైవర్ రక్తంలో 30శాతం ఎక్కువ ఆల్కహాల్ కనుగొనబడింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత దానిని కోర్టులో సమర్పించవచ్చు. తద్వారా నిందితుడైన డ్రైవర్, కండక్టర్లను కఠినంగా శిక్షించవచ్చు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో జూలై 1న సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై స్తంభం, డివైడర్ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. నాగ్పూర్ నుండి ఔరంగాబాద్ మార్గంలో బస్సు మొదట ఇనుప స్తంభాన్ని ఢీకొట్టి, అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. బుల్దానాలో జరిగిన ఈ ప్రమాదం తర్వాత ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా నేతలంతా సంతాపం వ్యక్తం చేయడంతో పాటు పరిహారం ప్రకటించారు.
Read Also:Richest Beggar: జనాలను బిత్తిరోళ్లను చేసిన బిచ్చగాడు.. ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
ఈ ప్రమాదం తర్వాత పోలీసులు సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఇందులో వాహనాల చక్రాల పరిస్థితి, గాలి/నత్రజని పీడనం, అత్యవసర కిటికీల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారా, చెల్లుబాటు అయ్యే పత్రాలు, ఇతర ముఖ్యమైన అంశాలను కూడా తనిఖీ చేశారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..