Mahakumbh : 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. సాధువు వేషంలో ప్రత్యేక్షం..
- నేడే మహా కుంభమేళా చివరి రోజు
- తప్పిపోయిన వారిని కలుసుకుంటున్న జనాలు
- 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కర్ణాటక వాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో ఈరోజు చివరి రోజు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా కారణంగా.. కుటుంబం నుంచి తప్పిపోయిన వాళ్లను సైతం కొంత మంది కలుసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని విజయపురానికి చెందిన రమేష్ చౌదరి. ఈయన 24 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా ద్వారా తన కుటుంబాన్ని తిరిగి కలిశాడు.
READ MORE: Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు
Also Read
విజయపురలోని కొల్హారా తాలూకాలోని బలుటి గ్రామానికి చెందిన రమేష్ చౌదరి 2001లో తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా ద్వారా కుటుంబీకుల చెంతకు చేరుకున్నాడు. 24 సంవత్సరాల క్రితం రమేష్ కనిపించకుండా పోయినపుడు.. అతని కోసం విస్తృతంగా వెతికారు. కానీ ఎలాంటి ఫలితం లభించలేదు. తాజాగా బలుటి గ్రామానికి చెందిన మల్లనగౌడ పాటిల్, ఇతరులు ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాకు వెళ్లారు. పుణ్యస్నానాలు పూర్తి చేసుకుని.. కాశీకి బయలుదేరారు. అక్కడ వారికి రమేష్ కనిపించాడు. కాశీలో ఒక సాధువు వేషంలో రమేష్ను దర్శనమిచ్చాడు. కుటుంబీకులతో వీడియో కాల్లో మాట్లాడి.. బలుటి గ్రామానికి తిరిగి తీసుకెళ్లాడు.
READ MORE: Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. “నేను ఇంటి నుంచి తప్పిపోయి అనేక నగరాలు తిరిగాను. తరువాత నేను బీహార్లోని పాట్నా చేరుకున్నాను. అక్కడ తారు రోడ్డు వేసే పనులు చేశాను. నా ఇళ్ల నాకు చాలా గుర్తుకు వచ్చింది. నేను రెండు సార్లు ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ విరమించుకున్నాను. ఇక్కడికి వచ్చిన మల్లన గౌడ నా కొడుకు, తల్లిదండ్రులు, కుటుంబం గురించి చెప్పాడు. ఇప్పుడు నేను నా కుటుంబం వద్దకు వెళ్లాలను కుంటున్నాను.” అని తెలిపాడు.
తాజావార్తలు
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?