Mahabubnagar IT Tower : ప్రారంభోత్సవానికి సిద్ధమైన మహబూబ్నగర్ ఐటీ టవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఐటీ రంగం హబ్గా ఉంటూనే, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో ఐటీ టవర్ల నిర్మాణం వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలోని టైర్-2 నగరాలు ప్రధాన వృద్ధి చోదకులుగా ఎదుగుతున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని. అందులో భాగంగానే ఐటీ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పేందుకు సకల సౌకర్యాలతో నాలుగు ఎకరాల సువిశాల స్థలంలో రూ.40 కోట్లతో నిర్మించిన ఐదంతస్తుల ఐటీ టవర్ శనివారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మహబూబ్నగర్ శివార్లలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు శనివారం ప్రారంభించనున్నారు.
Also Read : Deenraj: ‘భారతీయన్స్’ టీజర్ ఆవిష్కరించిన సురేశ్ బాబు!
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
రాష్ట్రంలోని టైర్-2 నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 2018 జూలైలో మంత్రి కెటి రామారావు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇవే కాకుండా 377 ఎకరాల్లో ఐటీ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ టవర్ నుండి 100 అడుగుల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈవో విజయ రంగినేని మాట్లాడుతూ.. ఐటీ టవర్ నుంచి ఇప్పటి వరకు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎనిమిది కంపెనీలు ముందుకు వచ్చాయని, స్థలం కేటాయించామని తెలిపారు. కాగా, ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
Also Read : Minister KTR : బీఆర్ఎస్ అంటే భారత్ రైతు సమితి
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!