Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా? ఈ సారి భక్తులకు కొత్త సౌకర్యాలు
- జనవరి 13 నుంచి మహా కుంభమేళా
- ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న కొనసాగింపు
- ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పేరు
- ఈ సారి పలు ప్రత్యేక ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్రాజ్లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.
ఈసారి క్యూఆర్ టికెట్ సౌకర్యం ..
ఈ సారి రైల్వేశాఖ భక్తులకు పెద్ద కానుక అందించింది . ప్రయాగ్రాజ్లో టిక్కెట్ బుకింగ్ కోసం ఇప్పుడు భక్తులు రైల్వే స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఆప్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాగ్రాజ్లో రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ యాప్ డెమో ఇచ్చారు. ఈ యాప్ ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మహాకుంభానికి సంబంధించి 50 నగరాల నుంచి రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు మార్గం ద్వారా ప్రతిరోజూ 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ కుంభమేళకు చేరుకుంటారని అంచనా.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
‘పింక్ వెహికల్’ సౌకర్యం..
ఈసారి ప్రయాగ్రాజ్ మహాకుంభ్లో భక్తులు, పర్యాటకులకే ఈ-రిక్షా, ఈ-ఆటో సౌకర్యం లభిస్తుంది. మహిళా భక్తులు, పర్యాటకుల కోసం ‘పింక్ వెహికల్’ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఓలా, ఉబర్ తరహాలో యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి, ఈ ప్రదేశాన్ని కాలుష్య రహితంగా ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇ-ఆటోలు, ఇ-రిక్షాలను నడపాలని నిర్ణయించారు. అంతేకాకుండా వారి డ్రైవర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
వాయిస్ ఛేంజర్ ఫీచర్..
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యటకుల కోసం వాయిస్ ఛేంజర్ను తీసుకొచ్చారు. ఎవరైనా ఈ ఆసుపత్రిలో చేరినట్లయితే, వారి భాషను అర్థం చేసుకోవడానికి భాషను, వారు చెప్పేది హిందీ, ఇంగ్లీష్ లోకి మార్చే వాయిస్ ఛేంజర్ను ఇన్స్టాల్ చేస్తారు. ఇది డాక్టర్కు సులభంగా అర్థం చేసుకోవడానికి, వారికి చికిత్స చేయడంలో సహాయం చేస్తుంది.
ఈ ఆస్పత్రిలో చిన్న, పెద్ద ఆపరేషన్లు కూడా చేయగలుగుతారు. గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!