Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millets: భారతదేశాన్ని ‘శ్రీ అన్న’ (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో, 27 ఏళ్ల బైగా గిరిజన మహిళ లహరీ బాయి నిజమైన బ్రాండ్ అంబాసిడర్గా ఉద్భవించింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని గిరిజనులు అధికంగా ఉండే డిండోరి జిల్లాలో ముతక ధాన్యాలను సాగు చేస్తూ మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది.
మధ్యప్రదేశ్లోని దిండోరికి చెందిన 27 ఏళ్ల గిరిజన మహిళ లహరీ బాయి తన ‘బీజ్ బ్యాంక్’తో మిల్లెట్స్కు గ్రాస్రూట్ బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగింది. లహరి తన యుక్తవయసులో మిల్లెట్ విత్తనాల రకాలను సేకరించడం, సంరక్షించడం ప్రారంభించినప్పుడు తన సొంత బైగా గిరిజన సంఘం తనను తరచుగా ఎగతాళి చేసేదని గుర్తుచేసుకుంది. లహరి తన తల్లిదండ్రులతో ఓ చిన్న గుడిసె ఇంట్లో ఉంటోంది. ఒక గది లివింగ్ రూమ్, కిచెన్గా పనిచేస్తుండగా, మరొకటి మిల్లెట్ పంటల ‘బీజ్ బ్యాంక్’గా మార్చబడింది, ఇది వివిధ ముతక ధాన్యాల 30-ప్లస్ అరుదైన విత్తనాలను సంరక్షిస్తుంది.
Also Read
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Harish Rao: "త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా".. హరీష్ రావు సంచలన ప్రకటన..
- ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ఆమె తన పొలంలో వాటిని విత్తుతుంది. తన గ్రామంలో సాగు కోసం రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఆమె మధియా, సల్హార్, సభ, కోడో, కుట్కి, సాన్వా, కుట్టు, చీనా వంటి అరుదైన మిల్లెట్లను సంరక్షించింది. మా అమ్మమ్మలు మిల్లెట్ తిని ఆరోగ్యంగా ఉండేవారని, ఇప్పుడు ఈ ఆహారం మాయమైపోయిందని, దాని గురించి నాకు చెప్పారని, అందుకే వాటిని రక్షించడం ప్రారంభించానని ఆమె చెప్పారు. లహరి దిండోరిలో శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కుటుంబం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ను పొందింది. అయితే, వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, వారు గ్యాస్ సిలిండర్ను రీఫిల్ చేసుకోలేక ఇప్పుడు చుల్హాలో వంట చేయడానికి తిరిగి వచ్చారు. ఆమె గ్రామం కూడా నీటి కొరతను ఎదుర్కొంటోంది.
Treat Pneumonia: న్యుమోనియా చికిత్స.. 3 నెలల పాపను వేడిరాడ్తో 51 సార్లు కొట్టి..
ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో ఆమెను ముఖ్య అతిథిగా డిండోరి కలెక్టర్ వికాష్ మిశ్రా ప్రకటించారు. ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మిల్లెట్లు, ముఖ్యంగా కోడో, కుట్కి, దాదాపు 39,000 హెక్టార్లలో ఎక్కువగా సామ్నాపూర్, దిండోరిలోని బజాగ్ బ్లాక్లలో సాగు చేస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మినుములను ‘శ్రీ అన్న’ – అన్ని ధాన్యాలకు తల్లిగా అభివర్ణించారు. ముతక ధాన్యాల ఉత్పత్తిలో ఛత్తీస్గఢ్ అగ్రస్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జోవర్, బజ్రా, రాగిలకు కనీస మద్దతు ధర ప్రకటించింది.
తాజావార్తలు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..