Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక
- నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం
- అక్టోబర్లో నివేదిక సమర్పించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ఫోర్స్ (NTF) అక్టోబర్ 2026లో తన తుది నివేదికను సమర్పించనుంది. ఈ నివేదికలో నీట్ (NEET) వంటి పోటీ ప్రవేశ పరీక్షల ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల సంస్కృతి, తరచూ మారుతున్న పాఠ్యాంశాలు, విద్యా వ్యవస్థలోని అసమానతలు విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి ప్రధాన కారణాలుగా పేర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ఈ టాస్క్ఫోర్స్ను 2025 మార్చిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల కారణాలను అధ్యయనం చేసి, వాటిని నివారించేందుకు సమగ్ర సిఫార్సులు చేయాలని ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. టాస్క్ఫోర్స్ అభిప్రాయం ప్రకారం.. విద్యార్థుల ఆత్మహత్యలను కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడలేమని.. అనేక సామాజిక, ఆర్థిక, విద్యా, కుటుంబ సంబంధిత ఒత్తిళ్లు కలిసి ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని పేర్కొననుంది.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ఒత్తిడికి ప్రధాన కారణాలు
నివేదికలో విద్యార్థులపై ప్రభావం చూపుతున్న పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. వాటిలో పోటీ పరీక్షల ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల సంస్కృతి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల అంచనాలు, వివక్ష, భాషా సమస్యలు, సామాజిక ఒంటరితనం, విద్యాసంస్థల్లోని పరిపాలనా సమస్యలు వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
పాఠశాల స్థాయి నుంచే ఒత్తిడి
విద్యార్థులపై ఒత్తిడి ఉన్నత విద్యలో కాకుండా పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతోందని.. ముఖ్యంగా పోటీ ప్రవేశ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే సమయంలో అది మరింత పెరుగుతోందని కమిటీ అభిప్రాయపడే అవకాశం ఉంది. అలాగే ఇంగ్లిష్ కాని భాషా నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు సాంకేతిక విద్యాసంస్థల్లో అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదికలో ప్రస్తావించనున్నారు. విద్యాసంస్థల్లో అధిక విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల కొరత, హాస్టల్ సౌకర్యాల లోపం, స్కాలర్షిప్ల ఆలస్యం, అధ్యాపకులు-విద్యార్థుల మధ్య పరిమిత పరస్పర సంబంధాలు వంటి సమస్యలను కూడా టాస్క్ఫోర్స్ ప్రస్తావించనుంది.
అదేవిధంగా పాఠ్యభారాన్ని తగ్గించడం, బట్టీ పద్ధతికి బదులుగా విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థులకు తమకు నచ్చిన విద్యా విభాగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించడం, కేవలం మార్కులపై కాకుండా విద్యార్థుల సమగ్ర మానసిక, శారీరక సంక్షేమంపై దృష్టి పెట్టడం వంటి కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉంది.
లక్షలాది మందితో సంప్రదింపులు
ఈ నివేదిక తయారీలో భాగంగా టాస్క్ఫోర్స్ సుమారు 60 వేల మంది ఉపాధ్యాయులు, దాదాపు 16 వేల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 2.5 నుంచి 3 లక్షల మంది తల్లిదండ్రులు, ప్రజల అభిప్రాయాలు సేకరించింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 40 విద్యాసంస్థలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను అధ్యయనం చేసింది.
సుప్రీంకోర్టు ఆందోళన
అమిత్ కుమార్ తదితరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2026) కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని, 2022లో దేశంలో 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అదే ఏడాది రైతుల ఆత్మహత్యల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. మొత్తం ఆత్మహత్యల్లో 7.6 శాతం విద్యార్థులవేనని గుర్తించిన సుప్రీంకోర్టు, సమస్యకు మూల కారణాలను గుర్తించి నివారణ చర్యలు సూచించేందుకు ఈ జాతీయ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?