Madhya Pradesh: ప్రొఫెసర్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి.. ఆస్పత్రికి తరలింపు
- మధ్యప్రదేశ్లో దారుణం
- ప్రొఫెసర్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి
- పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
- పాత తగాదాలతో పూర్వ విద్యార్థి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ జేహెచ్పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఐదు నుంచి ఏడుగురు దుండగులు కర్రలు, కారంపొడితో కళాశాల ఆవరణలోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. నీరజ్ ధాకడ్ సంస్కృత విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘాతుకానికి తెగబడింది.. ఓల్డ్ స్టూడెంట్గా గుర్తించారు. స్కాలర్షిప్ విషయంలో గతంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని అన్నూ ఠాకూర్ అనే పాత విద్యార్థి ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Jangaon: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
దుండగులు ప్రొఫెసర్ ధాకడ్ను కర్రలతో కొట్టే ముందు కళ్లల్లోకి కారం పొడి పోసి అచేతనంగా పడి ఉన్న ప్రొఫెసర్పై దాడి చేశారు. అయితే చుట్టూ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రొఫెసర్ ధాకడ్ స్పృహ కోల్పోయే వరకు దాడి చేశారు. దాడి చేసినవారు పారిపోయిన తర్వాత మాత్రమే సహోద్యోగులు ప్రొఫెసర్ ధాకడ్కు సహాయం చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Kalki 2898AD: కల్కి నుంచి భైరవ ఆంథమ్ ప్రోమో వచ్చేసింది చూశారా..
ప్రొఫెసర్ తల, చేతులు, కాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. తీవ్ర గాయాలైనట్లు వైద్య నివేదికలు నిర్ధారించాయి. దాడి చేసిన వారిలో ఒకరైన కళాశాల పూర్వ విద్యార్థి అన్ను ఠాకూర్కు ప్రొఫెసర్కు గతంలో జరిగిన వివాదమే కారణంగా తేల్చారు. నెల క్రితం ధాకడ్కు సంబంధించిన స్టాంప్, లెటర్ హెడ్ను దుర్వినియోగం చేసినట్లుగా సమాచారం. ఇదే ఘర్షణకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రొఫెసర్ స్టేట్మెంట్ ప్రకారం.. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడపడుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!