Man Hires Killer: ఎంత దుర్మార్గం.. ఆ డబ్బు కోసం కక్కుర్తి పడిన కొడుకు ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Hires Killer: రాను రాను సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పొరుగు సంబంధాల గురించి దేవుడెరుగు.. రక్త సంబంధాలే రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతున్నాయి. బంధాల కంటే డబ్బుపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. అది ఎంతలా అంటే పదవి కోసం, డబ్బు కోసం ఏకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హతమార్చేంతటి దారుణమైన ఘోరానికి పాల్పడుతున్నారు. ఇక వివరాల్లోకి వస్తే ప్రమాద బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవడానికి ఓ వ్యక్తి కన్నతండ్రినే చంపేందుకు కూడా వెనకాడలేదు. బీమా డబ్బు కోసం సొంత తండ్రిని హత్య చేసేందుకు మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కిరాయి హంతకుడిని నియమించుకున్నాడు. ఓ వాహనంతో వెనుక నుంచి ఢీకొట్టేలా పథకాన్ని కూడా రచించాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యగా నిర్ధారించారు.
మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో ఒక వ్యక్తి తన ప్రమాద బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవడానికి తన తండ్రిని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు.తన 52 ఏళ్ల తండ్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడని పేర్కొంటూ నిందితుడు నవంబర్ 10న సెంద్వా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో మరణం వెలుగులోకి వచ్చిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యకేసుగా నిర్ధారించారని తెలిపారు. బాధితుడిని ఢీకొన్న వాహనం స్థానికంగా తిరుగుతున్నట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో తేలిందని సెంద్వా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజేష్ యాదవ్ తెలిపారు.
Also Read
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
USA: మోదీకి మినహాయింపు ఇచ్చినట్లే సౌదీ యువరాజుకు కూడా మినహాయింపు..
బాధితుడికి రోజూ ఉదయం వాకింగ్కు వెళ్లే అలవాటు ఉంది. నవంబర్ 10న, నిందితుడు తన తండ్రి మార్నింగ్ వాక్కు వెళ్లాడని కాంట్రాక్ట్ కిల్లర్కు ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు. దర్యాప్తు తరువాత, అనుమానితులలో ఒకరైన కరణ్ షిండేను పుణె నుంచి అరెస్టు చేశారు. విచారణలో, హత్యకు ₹ 2.5 లక్షలు ఇస్తానని బాధితురాలి కుమారుడు వాగ్దానం చేసినట్లు అతను చెప్పాడు. బాధితుడి కుమారుడు తన తండ్రికి రూ.10 లక్షలకు ప్రమాద బీమా తీసుకున్నాడని, హంతకులను నియమించాడని విచారణలో అంగీకరించాడు. ఈ నేరంలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!