Megha Parmar: మేఘా పర్మార్ను అంబాసిడర్గా తొలగించిన ఎంపీ సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megha Parmar: మేఘా పర్మార్.. మధ్యప్రదేశ్ నుండి మౌంట్ ఈవెంట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ. ఆమె పేరును ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా తొలగించబడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 9న చింద్వారాలో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘా పర్మార్ కాంగ్రెస్లో చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్లో చేరిన ఒక రోజు తర్వాత, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్గా ఉన్న మేఘాను మహిళా, శిశు అభివృద్ధి శాఖ రద్దు చేసింది. ఐదు రోజుల తర్వాత, మే 15న, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా ఆమె పేరు కూడా తొలగించబడింది. ఈ పరిణామాన్ని అనుసరించి, కాంగ్రెస్లో చేరినందుకే మేఘాను అంబాసిడర్ పాత్ర నుండి తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. దేశం గర్వించేలా చేసిన మేఘా పర్మార్ను కాంగ్రెస్లో చేరడమే ఏకైక నేరంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అంబాసిడర్గా తొలగించారని ఆ పార్టీ నాయకుడు కేకే మిశ్రా అన్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Read Also: Mukesh Ambani : అంబానీ లిఫ్ట్ చూశారా? డబుల్ బెడ్రూం అంత ఉంటుంది
అంబాసిడర్గా తన ప్రస్తుత బాధ్యత నుంచి వైదొలగడంపై మేఘా పర్మార్ మాట్లాడుతూ.. బీజేపీకి బేటీ బచావో బేటీ హటావోగా మారిందని మండిపడ్డారు. “నేను రైతు కూతురిని. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని జయించడాన్ని నేను ఊహించలేకపోయాను. కమల్ నాథ్ నాకు చాలా సహాయం చేశారు. ఆయన నాకు ఆర్థిక సహాయం చేశారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని జయించగలిగాను. సినీ నటీమణులకు బదులు రైతు కూతురిని ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు కమల్నాథ్. కానీ మహిళల గౌరవం గురించి పెద్దగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం అదే రైతు కూతురిని బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పించింది” అని మేఘా పర్మార్ అన్నారు. “ఈ రోజు మహిళా సాధికారత గురించి బీజేపీ చేస్తున్న వాదనలు బట్టబయలయ్యాయి. శివరాజ్ ప్రభుత్వం చర్య నన్ను అవమానించడమే కాకుండా మహిళా సాధికారతను కించపరిచింది” అని ఆమె అన్నారు. కాగా, మేఘా పర్మార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మే 22, 2019న, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన మొదటి మహిళగా మేఘ నిలిచింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!