Megha Parmar: మేఘా పర్మార్ను అంబాసిడర్గా తొలగించిన ఎంపీ సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megha Parmar: మేఘా పర్మార్.. మధ్యప్రదేశ్ నుండి మౌంట్ ఈవెంట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ. ఆమె పేరును ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా తొలగించబడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 9న చింద్వారాలో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘా పర్మార్ కాంగ్రెస్లో చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్లో చేరిన ఒక రోజు తర్వాత, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్గా ఉన్న మేఘాను మహిళా, శిశు అభివృద్ధి శాఖ రద్దు చేసింది. ఐదు రోజుల తర్వాత, మే 15న, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్గా ఆమె పేరు కూడా తొలగించబడింది. ఈ పరిణామాన్ని అనుసరించి, కాంగ్రెస్లో చేరినందుకే మేఘాను అంబాసిడర్ పాత్ర నుండి తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. దేశం గర్వించేలా చేసిన మేఘా పర్మార్ను కాంగ్రెస్లో చేరడమే ఏకైక నేరంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అంబాసిడర్గా తొలగించారని ఆ పార్టీ నాయకుడు కేకే మిశ్రా అన్నారు.
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
Read Also: Mukesh Ambani : అంబానీ లిఫ్ట్ చూశారా? డబుల్ బెడ్రూం అంత ఉంటుంది
అంబాసిడర్గా తన ప్రస్తుత బాధ్యత నుంచి వైదొలగడంపై మేఘా పర్మార్ మాట్లాడుతూ.. బీజేపీకి బేటీ బచావో బేటీ హటావోగా మారిందని మండిపడ్డారు. “నేను రైతు కూతురిని. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని జయించడాన్ని నేను ఊహించలేకపోయాను. కమల్ నాథ్ నాకు చాలా సహాయం చేశారు. ఆయన నాకు ఆర్థిక సహాయం చేశారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని జయించగలిగాను. సినీ నటీమణులకు బదులు రైతు కూతురిని ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు కమల్నాథ్. కానీ మహిళల గౌరవం గురించి పెద్దగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం అదే రైతు కూతురిని బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పించింది” అని మేఘా పర్మార్ అన్నారు. “ఈ రోజు మహిళా సాధికారత గురించి బీజేపీ చేస్తున్న వాదనలు బట్టబయలయ్యాయి. శివరాజ్ ప్రభుత్వం చర్య నన్ను అవమానించడమే కాకుండా మహిళా సాధికారతను కించపరిచింది” అని ఆమె అన్నారు. కాగా, మేఘా పర్మార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మే 22, 2019న, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన మొదటి మహిళగా మేఘ నిలిచింది.
తాజావార్తలు
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!