Madhu Yashki Goud: పాతవారిని పక్కనబెట్టి.. కొత్తవారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. పాతవారిని పక్కన పెట్టి కొత్త వారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు పార్టీని నమ్ముకుని ఉన్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మధుయాష్కి అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల సీట్ల కేటాయింపు జరగలేదు అని ఆయన పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం సరికాదని.. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని మధుయాష్కి గౌడ్ తెలిపారు.
Read Also: Thailand: చైనా పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ కొత్త వీసా రహిత విధానం
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు చర్చలు జరిపారని నందికంటి శ్రీధర్ తెలిపారు. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ కేటాయించే అంశంపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని నందికంటి శ్రీధర్ అన్నారు.
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!