Madhu Yashki Goud: పాతవారిని పక్కనబెట్టి.. కొత్తవారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. పాతవారిని పక్కన పెట్టి కొత్త వారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు పార్టీని నమ్ముకుని ఉన్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మధుయాష్కి అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల సీట్ల కేటాయింపు జరగలేదు అని ఆయన పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం సరికాదని.. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని మధుయాష్కి గౌడ్ తెలిపారు.
Read Also: Thailand: చైనా పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ కొత్త వీసా రహిత విధానం
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు చర్చలు జరిపారని నందికంటి శ్రీధర్ తెలిపారు. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ కేటాయించే అంశంపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని నందికంటి శ్రీధర్ అన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!