Madhu Yashki : బచ్చాగాళ్లతో మేము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. జూనియర్లు, సీనియర్లు అంటూ నాయకుల మధ్య చిచ్చురగులుకుంది. దీంతో.. అధిష్టానం దిజ్వియజ్సింగ్ను రంగంలోకి దింపడంతో.. ఆయన టీకాంగ్రెస్ నేతలతో సమస్య పరిష్కారానికి చొరవ చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ వ్యవహాల ఇంచార్జ్గా ఉన్న మాణిక్కం ఠాగూర్ను గోవాకు ఇంచార్జ్గా నియమించి.. గోవాకు ఇంచార్జ్గా ఉన్న మాణిక్ రావు థాక్రేను తెలంగాణకు ఇంచార్జీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింద కాంగ్రెస్ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. కొత్త ఇంచార్జ్ నియామకం శుభపరిణామమన్నారు. ఇంచార్జ్ అందరిని కలుపుకుని పోవాలి… కానీ ఠాగూర్ అది విస్మరించారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ఇంచార్జి సూపర్ పవర్ మ్యాన్ అనుకుంటున్నరూ.. ఠాగూర్ ఇంచార్జి అయ్యాక …మారిపోయారు.. మేము ఎవరిని మార్చాలని అడగలేదని ఆయన అన్నారు. దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు ఇంచార్జ్గా మార్చారన్నారు. ఎవరు..ఇంకొకరి పదవి కోరుకోవడం లేదన్నారు. పీసీసీ అయినా.. ఇంకా ఏదైనా పదవి వచ్చిన వాళ్ళు అనుకువ ఉండాలన్నారు. మేము ఎవరికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదని, పార్టీ బాగుకోసం సమావేశం పెట్టామన్నారు.
Also Read : Ramya Raghupathi: నరేష్ ఒక నీచుడు.. రాఖీ కట్టిన అన్నతో నాకు ఎఫైర్ అంటగట్టాడు
సీనియర్లు.. జూనియర్లు అనేది ఏం లేదని, బచ్చాగాళ్లతో మేము క్యారెక్టర్ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్కి మంచి రోజులు రావాలి..వస్తాయన్నారు. కాంగ్రెస్ వస్తేనే.. ప్రజలు బాగుంటారని, తెలంగాణ పదం తెలంగాణలో చంద్రబాబు నిషేధించారన్నారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకుండా చేశారన్నారు. దేశం కోసమే అయితే… తెలుగు రాష్ట్రాల విభజన కోసం ఎందుకు కొట్లాడావు అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఇంచార్జి వచ్చాకా.. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని, కర్ణాటకలో బస్సు యాత్ర చేస్తున్నారని, తెలంగాణలో కూడా అలాంటి కార్యాచరణ చేస్తే బావుంటుందన్నారు. అందరం కలిసి పనిచేయాలన్నారు మధు యాష్కీ.
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..