Madhavaram Krishna Rao : ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారు
- గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించింది
- ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారు : ఎమ్మెల్యే మాధవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavaram Krishna Rao : గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు లోని జిహెచ్ఎంసి ఆధీనంలో ఉండే రమ్య గ్రౌండ్ పార్కు స్థలాన్ని సైతం హౌసింగ్ బోర్డ్ అధికారులు బోర్డులు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రజల సౌకర్యార్థం కె.పి.హెచ్.బి కాలనీలో మహిళా పార్కులు, చిల్డ్రన్ పార్కులను , ఆట స్థలాలను క్రికెట్ గ్రౌండ్ లను ఏర్పాటు చేశామన్నారు.
Indian Community: డొనాల్డ్ ట్రంప్కు అభినందనలు తెలిపిన భారత కమ్యూనిటీ
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
అయితే.. దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం దారుణమన్నారు. హౌసింగ్ బోర్డ్ స్థలాలలో ప్రజాప్రయోజనార్ధం 10 శాతం భూములను గుడులకు బడులకు పార్కులకు కేటాయించాలని ఎలాంటి కేటాయింపులు చేయకుండా వేలం పాటలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న దేవాలయ మండపానికి ఎవరికీ చెప్పకుండా ఎలా సీజ్ చేస్తారని కనీసం పంచనామా జరపకుండా ఆలయ సిబ్బందికి కమిటీకి చెప్పకుండా అధికారులు ఎలా సీట్ చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ఈనెల 24 వ తారీఖున జరిగే వేలం పాటను అడ్డుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
World Economic Forum : దావోస్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు.. రాష్ట్రాలకు పెట్టుబడులే లక్ష్యంగా..
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!