Madhavaram Krishna Rao : ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారు
- గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించింది
- ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారు : ఎమ్మెల్యే మాధవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavaram Krishna Rao : గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు లోని జిహెచ్ఎంసి ఆధీనంలో ఉండే రమ్య గ్రౌండ్ పార్కు స్థలాన్ని సైతం హౌసింగ్ బోర్డ్ అధికారులు బోర్డులు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రజల సౌకర్యార్థం కె.పి.హెచ్.బి కాలనీలో మహిళా పార్కులు, చిల్డ్రన్ పార్కులను , ఆట స్థలాలను క్రికెట్ గ్రౌండ్ లను ఏర్పాటు చేశామన్నారు.
Indian Community: డొనాల్డ్ ట్రంప్కు అభినందనలు తెలిపిన భారత కమ్యూనిటీ
Also Read
అయితే.. దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం దారుణమన్నారు. హౌసింగ్ బోర్డ్ స్థలాలలో ప్రజాప్రయోజనార్ధం 10 శాతం భూములను గుడులకు బడులకు పార్కులకు కేటాయించాలని ఎలాంటి కేటాయింపులు చేయకుండా వేలం పాటలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న దేవాలయ మండపానికి ఎవరికీ చెప్పకుండా ఎలా సీజ్ చేస్తారని కనీసం పంచనామా జరపకుండా ఆలయ సిబ్బందికి కమిటీకి చెప్పకుండా అధికారులు ఎలా సీట్ చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ఈనెల 24 వ తారీఖున జరిగే వేలం పాటను అడ్డుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
World Economic Forum : దావోస్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు.. రాష్ట్రాలకు పెట్టుబడులే లక్ష్యంగా..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!