Betting Apps Case: పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అందుకే.. బెట్టింగ్ యాప్స్ కేసులపై మాదాపూర్ డీసీపీ వివరణ
- కేసుల వివరాలు సేకరిస్తున్నామన్న డీసీపీ
- యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపుతామని వెల్లడి
- వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తామన్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహకులు.. పాన్ ఇండియా స్టార్స్ తో యాడ్స్ రూపంలో షూట్ చేసి వివిధ ప్లాట్ ఫామ్స్ లో ప్రమోట్ చేశారని తెలిపారు. యూట్యూబర్స్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వ్యక్తిగతంగా వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వారి వ్యక్తిగత అకౌంట్లో కూడా బెట్టింగ్స్ యాప్ గురించి ప్రమోట్ చేశారని చెప్పారు. అలా చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2017 నుంచి తెలంగాణలో బెట్టింగ్స్ యాప్స్ పై నిషేధం ఉందని వెల్లడించారు. బెట్టింగ్స్ యాప్స్ నిర్వహకులతో వీరు ఏ ఏ పద్ధతుల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది తేల్చాల్సి ఉందని.. ఈ కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని వివరించారు.
READ MORE: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..
Also Read
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- E20 Petrol: E20 పెట్రోల్పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
- Bhojshala Case: భోజ్శాలలో నమాజ్కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సహా బాలీవుడ్ నటీనటుల వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్కు సంబంధించి నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్త పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
READ MORE: Guava Leaves: జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!