Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..
- మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
- పల్నాడు ఎస్పీ ఆఫీసుకు తరలింపు..
- పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన ఏపీ హైకోర్టు..
- పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం.. ఎన్నికల అల్లర్ల కేసులు..
Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పల్నాడు ఎస్పీ ఆఫీసుకు తరలించారు.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు.. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులు నమోదైన విషయం విదితమే.. ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం చేస్తూ దొరికిన విజువల్స్ తో పాటు పలు హత్యాయత్న కేసులు కూడా పిన్నెల్లి పై నమోదు అయ్యాయి.. గడిచిన కొద్ది వారాలుగా కండిషన్ బెయిల్ పై నరసరావుపేటలోని ప్రైవేట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . పోలీసుల పర్యవేక్షణలో ప్రతినిత్యం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టి వచ్చేలాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్పోర్ట్ను కూడా కోర్టు సీజ్ చేసిన నేపథ్యంలో నరసరావుపేటలోనే ఉంటున్నారు రామకృష్ణారెడ్డి … ఈరోజు పిన్నెల్లి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు.
Read Also: Nagarjuna: మా నాగ్ బంగారం రా.. ఆ ఫ్యాన్ ను కలిసి ఫొటో ఇచ్చాడు!
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
కాగా, ఆ మూడు కేసుల్లో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. గతంలో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు కొనసాగించారు.. గతంలో తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు.. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇచ్చింది.. ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పిన్నెల్లి పై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు.. అయితే, ఈ కేసుల్లో ఆయనకు ఊరట కల్పిస్తూ.. ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది.. దీంతో.. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.. పిటిషన్లు మొత్తం డిస్మిస్ కావడంతో.. ఆ వెంటనే పిన్నెల్లిని అరెస్ట్చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!