Machani Somnath: బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీపై మాచాని సోమనాథ్ ఇంటింటి ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కె. తిమ్మాపురం గ్రామంలో డాక్టర్ మాచాని సోమనాథ్ ( Machani Somnath) బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ ( cm jagan ) అరాచక పాలన కొనసాగిస్తూ.. ధన యజ్ఞానికి పాల్పడుతూ.. జలయజ్ఞాన్ని పూర్తిగా విస్మరించి రైతును దగా చేశారని దుయ్యపడ్డారు. డాక్టర్ మాచాని సోమనాథ్ ను కర్నూల్ ( Karnool ) పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కేటి మల్లికార్జున ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Read Also: Nikki Haley: అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ నిష్క్రమణ!
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
ఇక, వందలాదిమంది టీడీపీ ( TDP) కార్యకర్తలు మాచాని సోమనాథ్ కి బ్రహ్మరథం పట్టారు. ఇక, ఆయన మహర్షి వాల్మీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ ఈశ్వర దేవాలయం నందు చంద్రబాబు ( Chandrababu) ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారికి ఆత్మహత్యలు శరణ్యంగా మారిపోయాయని ఆవేదన చెందారు. రైతు భరోసాను దగా చేయడమే కాకుండా మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆరోపించారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరకరణ నిధి, రూ.4 వేల కోట్లతో.. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీ ఇచ్చి నేడు అమలు చేయకుండా మోసం చేశారని ఆవేదన చెందారు.
Read Also: IND Vs ENG 5th Test: ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు..
ఆర్బీకేల ( RBK ) పేరుతో ఆర్భాటం తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదని మాచాని సోమనాథ్ అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హాయంలో రూ.68,293,94 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి, 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టుకు సాగునీరు అందించి వ్యవసాయ రంగంలో.. రైతాంగాన్ని ఆదుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో రైతు మోసపోకుండా జగన్ ను సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, కె. తిమ్మాపురం గ్రామ టిడిపి నాయకులు బి.జి. చంద్రన్న, బీటీ చిన్న హనుమంతు, ఉప్పర వీరేష్, ఈడిగ నరసప్ప, సాయి పోగు మార్కు, చాకలి శంకరన్న తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!