Poisonous Food: చికెన్లో చనిపోయిన ఎలుక.. లూథియానాలో దాబా యజమానిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poisonous Food: పంజాబ్లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దాబాలో ఆహారంలో చనిపోయిన ఎలుక కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పుడు దాబా యజమానిపై కేసు నమోదైంది. దీనిపై దాబా యజమాని స్పందిస్తూ.. ఈ కస్టమర్లకు డిస్కౌంట్ కావాలని, డిస్కౌంట్ ఇవ్వనప్పుడు బలవంతంగా అలాంటి వీడియో తీశారని దాబా యాజమాన్యం ఓ వీడియోను విడుదల చేసింది.
కథనం ప్రకారం.. దాబాలో తినేందుకు వెళ్లిన ఓ కుటుంబం చికెన్ కర్రీ ఆర్డర్ చేసింది. ఆహారం ఎదురుగా రాగానే చికెన్ కూరలోనే చనిపోయిన ఎలుక కనిపించింది. ఈ వీడియోను కుటుంబ సభ్యులు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితుడి పేరు వివేక్ కుమార్. వివేక్ ప్రేమ్ నగర్ ఫీల్డ్ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివేక్ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం తన కుటుంబంతో కలిసి విశ్వకర్మ చౌక్లోని ప్రకాష్ ధాబాలో భోజనం చేసేందుకు వెళ్లినట్లు వివేక్ తెలిపాడు. ఇంతలో అతను చికెన్ కర్రీని కూడా ఆర్డర్ చేశాడు. అందులో చనిపోయిన ఎలుక బయటకు వచ్చింది. దీనిపై దాబా సిబ్బందికి ఫిర్యాదు చేయగా, తనను దుర్భాషలాడారని బెదిరించారని వివేక్ చెప్పారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
Read Also:IND vs WI: రింకూ సింగ్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి?.. బీసీసీఐని ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్!
Parkash dhaba Ludhiana. India Serve rat in chicken curry. Restaurant owner bribe the food inspector and go free??? Very poor standards in Kitchen of many Indian restaurants. Be aware . pic.twitter.com/chIV59tbq5
— NC (@NrIndiapolo) July 3, 2023
దాన్ని వివేక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతను కొంత ఆహారం కూడా తిన్నాడు, దాని కారణంగా చాలా మంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇప్పుడు పోలీసులు దాబా యజమానిపై పాడైన ఆహారాన్ని విక్రయించే చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుట్రపూరితంగా ఈ వీడియో తీశారని, తారుమారు చేశారని దాబా యజమాని చెబుతున్నారు.
Read Also:Anil Kumar Yadav: ఆస్తులపై వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణానికి సిద్ధం
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!