Rahul gandhi: రాయ్బరేలీ నుంచి రాహుల్..! అమేథీ నుంచి ఎవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు కంచుకోటలైన రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు శుక్రవారంతో నామినేషన్ గడువు ముగుస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి గురువారం సాయంత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ గత అర్ధరాత్రి వరకూ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు.
ఇదిలా ఉంటే రాయ్బరేలీ నుంచి రాహుల్గాంధీ బరిలోకి దిగవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అంతా ప్రచారం జరిగింది. కానీ.. చివరికి అమ్మ స్థానంలోకి కుమారుడే వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమేథీ స్థానంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది.. గానీ చివరికి ఈ స్థానంలోకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్. శర్మను రంగంలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?

సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్బరేలీ స్థానం ఖాళీ అయింది. అయితే సోనియా స్థానంలోకి కుమార్తె ప్రియాంక రావొచ్చని వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాహులే ఇక్కడ నుంచి పోటీ చేయొచ్చని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు కేఎల్. శర్మను అమేథీ నుంచి బరిలోకి దించవచ్చని ప్రచారం జరుగుతోంది.
రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇక ఈ రెండు స్థానాలకు శుక్రవారం నామినేషన్కు చివరి రోజు. అయినా కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కార్యకర్తలు అయోమయం.. గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉభయసభల్లో తల్లి, కొడుకు ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందన్న భావనతోనే ప్రియాంక వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబంపై బీజేపీ నుంచి విమర్శలు రాకూడదన్న భావనతోనే ప్రియాంక పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ జరగింది. ఇక మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
తాజావార్తలు
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!