Liquor Scam: లిక్కర్ కేసులో అవినాష్ రెడ్డికి రిమాండ్.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికు ACB కోర్టు విజయవాడ రేపటిదాకా రిమాండ్ విధించింది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరినీ కలిపి రేపు మళ్లీ కోర్టులో హాజరు పరచనున్నారు.
IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు మార్పులతో బరిలోకి భారత్.. సంజూ ఆన్ డ్యూటీ!
Also Read
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
లిక్కర్ స్కాం కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు విజయవాడలోని కార్యాలయంలో సుమారు ఐదు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తరువాత కోర్టులో హాజరు పరిచారు. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, రెండు చోట్లా పిటిషన్లు తిరస్కరించబడటంతో అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు.
రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ లిక్కర్ కుంభకోణంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు A1 కేసిరెడ్డితో కలిసి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. మద్యం సిండికేట్ను ఏర్పాటు చేసి, కిక్బ్యాక్లు, కమీషన్ల ద్వారా అక్రమంగా భారీ ఆర్థిక లాభాలు పొందినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. మద్యం సిండికేట్ కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా, ఆర్థిక నియంత్రణ దారుడిగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు తెలిపారు.
SA vs WI: మార్క్రమ్ మెరుపులు.. డీకాక్ దూకుడు! విండిస్ పై సౌతాఫ్రికా భారీ విజయం!
పాత బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, తమకు అనుకూలంగా కమిషన్లు ఇచ్చే బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వ్యక్తిగత ఖర్చులతో పాటు ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. రేపు కోర్టులో మరోసారి హాజరు పరచనున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!