Lionel Messi: భారత్లో పర్యటించనున్న ఫుట్బాల్ దిగ్గజం.. పూర్తి షెడ్యూల్ ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lionel Messi: ప్రస్తుత ఫుట్బాల్ దిగ్గజాలలో ఒకరైన లియోనెల్ మెస్సీ దాదాపు దశాబ్దం తర్వాత భారత్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కానీ, అధికారికంగా మెస్సీ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పుడైనా తన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఈ టూర్లో కొల్కతా, అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలు భాగంగా ఉండనున్నాయి. అతని పర్యటన చివర్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కూడా షెడ్యూల్లో ఉంది. అయితే, భారత్ లో ఫుట్బాల్ కు పేరుగాంచిన కేరళలో స్టాప్ లేదని సమాచారం. ఇకపోతే, మెస్సీ భారత టూర్లో తొలి అడుగు కోల్కతాలో పడనుంది. డిసెంబర్ 12 రాత్రి 10 గంటల ప్రాంతంలో చేరనున్న మెస్సీ, అక్కడ రెండు రోజుల పాటు ఉండనున్నారు. ఇది అతని టూర్లో అతి పెద్ద స్టాప్.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Kingdom : ఇంతకీ కింగ్ డమ్ హిట్టా కాదా..?
ఇక డిసెంబర్ 13న కోల్కతాలో ఉదయం 9 గంటలకు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత లేక్ టౌన్ శ్రీభూమి, VIP రోడ్ వద్ద 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేపట్టనున్నారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మెస్సీ విగ్రహం అవుతుందని నిర్వాహకుల అంచనా. ఆ తర్వాత మధ్యాహ్నం 12 – 1:30 మధ్య ఈడెన్ గార్డెన్స్లో సౌరవ్ గంగూలీ, లీండర్ పేస్, జాన్ అబ్రహాం, భైచుంగ్ భూటియా తదితరులతో మెస్సీ 7-ఏ-సైడ్ మినీ గేమ్లో పాల్గొంటాడు. ఈ మ్యాచ్ కు మొత్తం 68,000 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మ్యాచ్ వీక్షించాలంటే టికెట్ ధరలు రూ.3,500 పైగా ఉండే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెస్సీకి సత్కారం చేయనున్నారని సమాచారం.
Ram Charan: శ్రీరాముడిగా రామ్చరణ్? మహావతార్ నరసింహ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్, ముంబయి నగరాలలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ లలో ఆడనున్నారు. ఇక ముంబై ఈవెంట్ లో ఇండియన్ ఫుట్బాల్ జట్టు సభ్యులు (సునీల్ ఛేత్రి తదితరులు)తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక చివరగా డిసెంబర్ 15న న్యూఢిల్లిలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇక “కేరళలో ఎలాంటి ఈవెంట్ లేదు” అని తేల్చిచెప్పారు. ఇదివరకు 2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి ఇండియా వచ్చాడు. కోల్కతాలో వేనిజువెలాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. అప్పుడు మెస్సీకి జరిగిన స్వాగతం ‘మెస్సీ ఫీవర్’గా మారింది. 75,000 మంది సామర్ధ్యంతో సాల్ట్ లేక్ స్టేడియం కిక్కిరిసిపోయింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!