lightning Strikes: ఒడిశాలో స్కూల్ భవనంపై పిడుగుపాటు.. విద్యార్థులకు తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning struck the school..10 people were injured: భారీ వర్షాలు వరదలతో ఒడిశా రాష్ట్రం అల్లాడుతోంది. పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచానా వేస్తోంది. ఇదిలా ఉంటే ఒడిశాలోని దియోగర్ జిల్లాలో పాఠశాలపై పిడుగు వేయడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
దియోనగర్ జిల్లా తిలేబాని బ్లాక్ పరిధిలోని పుతురపాసి ప్రాథమిక పాఠశాలతో 17 మంది విద్యార్థులు ఉండగా..పాఠశాల గదిపై పిడుగు పడింది. దీంతో 10 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటు కారణంగా విద్యార్థులు కాలిన గాయాలకు గురయ్యారు. పిడుగు ప్రభావానికి విద్యార్థులు ఉన్న స్కూల్ బిల్డింగ్ కు రంధ్రం పడి, పై కప్పు నేలపై పడింది. పిడుగు పడే సమయంలో భారీగా వర్షం కురువడంతో విద్యార్థులంతా స్కూల్ గదిలోనే ఉన్నారు. గాయపడిన విద్యార్థులంతా మూడు, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులే.
Also Read
- Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ప్రమాదం అరుదైన ఘటన.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
Read Also: China: కరువు కోరల్లో చైనా.. “జాతీయ కరువు హెచ్చరిక” జారీ
పిడుగుపాటుకు గురైన వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశామని..10 మంది విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అందులో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద్ బెహెరా తెలిపారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థుల అవయవాలు సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కటక్ లో 55 ఏళ్ల రైతు తన పొలం దగ్గర ఉండగా పిడుగుపాటుకు గురై మరణించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.
ఈశాన్య, తూర్పు-మధ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలను అనుకుని ఉన్న ప్రాంతాలపై ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అల్పపడనం బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కియోంజర్,మయూర్భంజ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తాజావార్తలు
-
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ప్రమాదం అరుదైన ఘటన.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!