China: కరువు కోరల్లో చైనా.. “జాతీయ కరువు హెచ్చరిక” జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Issues Drought Alert: డ్రాగన్ కంట్రీ చైనా కరువు కోరల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది చైనా వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ తో పాటు నైరుతి చైనాలోని చాలా కౌంటీలు ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నాయి. దీంతో చైనా మొదటి జాతీయ కరువు హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ‘‘ ఎల్లో అలర్ట్ ’’ జారీ చేసింది. నైరుతిలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి యాంగ్జీ నది డెల్టాలోని షాంఘై నగరం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రపంచ వాతావరణ మార్పులే భారీ ఉష్ణోగ్రతలకు కారణం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్ లోని యాంగ్జీ నది ముఖ్యమైన వరద బేసిన్ లలో ఒకటైన పోయాంగ్ సరస్సు సాధారణ పరిమాణం కన్నా..నాలుగింట ఒక వంతు కుచించుకుపోయింది. చాగ్ కింగ్ లోని నైరుతి ప్రాంతంలోని 34 కౌంటీల్లో 66 నదులు ఎండిపోయాయని చైనా మీడియా పేర్కొంది. చాంగ్ కింగ్ లో సాధారణంతో పోలిస్తే 60 శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతల నుంచి పంటలను రక్షించడంతో పాటు కార్చిచ్చులను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది చైనా ప్రభుత్వం.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
Read Also: Manish Sisodia: లిక్కర్ స్కామ్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం.. అరెస్ట్ చేసే అవకాశం.
చైనా నైరుతి ప్రావిన్సుల్లో 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చాంగ్ కింగ్ ప్రాంతంలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రత వల్ల సిచువాన్ ప్రావిన్సులో 5.5 మిలియన్ల జనాభా ప్రభావితం అవుతున్నారు. శుక్రవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది చైనా ప్రభుత్వం. ఇదిలా ఉంటే హీట్ వేవ్ కారణంగా చైనా మునుపెన్నడు లేని విధంగా విద్యుత్ కోతలను చవిచూస్తోంది. చాలా ప్రాంతాల్లో పరిశ్రమలకు విద్యుత్ కట్ చేశారు. ఉష్ణోగ్రతల కారణంగా ఏసీల వాడకం పెరగడంతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది.
మరోవైపు యూరప్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. కరువు అంచున యూరప్ దేశాలు ఉన్నాయి. బ్రిటన్ తో పాటు పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయి నదులు ఎండుకు పోతున్నాయి. బ్రిటన్ లోని ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోయింది. దీంతో రానున్న కాలంలో యూరప్ కరువు బారిన పడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!