China: కరువు కోరల్లో చైనా.. “జాతీయ కరువు హెచ్చరిక” జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Issues Drought Alert: డ్రాగన్ కంట్రీ చైనా కరువు కోరల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది చైనా వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ తో పాటు నైరుతి చైనాలోని చాలా కౌంటీలు ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నాయి. దీంతో చైనా మొదటి జాతీయ కరువు హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ‘‘ ఎల్లో అలర్ట్ ’’ జారీ చేసింది. నైరుతిలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి యాంగ్జీ నది డెల్టాలోని షాంఘై నగరం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రపంచ వాతావరణ మార్పులే భారీ ఉష్ణోగ్రతలకు కారణం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్ లోని యాంగ్జీ నది ముఖ్యమైన వరద బేసిన్ లలో ఒకటైన పోయాంగ్ సరస్సు సాధారణ పరిమాణం కన్నా..నాలుగింట ఒక వంతు కుచించుకుపోయింది. చాగ్ కింగ్ లోని నైరుతి ప్రాంతంలోని 34 కౌంటీల్లో 66 నదులు ఎండిపోయాయని చైనా మీడియా పేర్కొంది. చాంగ్ కింగ్ లో సాధారణంతో పోలిస్తే 60 శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతల నుంచి పంటలను రక్షించడంతో పాటు కార్చిచ్చులను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది చైనా ప్రభుత్వం.
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Manish Sisodia: లిక్కర్ స్కామ్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం.. అరెస్ట్ చేసే అవకాశం.
చైనా నైరుతి ప్రావిన్సుల్లో 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చాంగ్ కింగ్ ప్రాంతంలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రత వల్ల సిచువాన్ ప్రావిన్సులో 5.5 మిలియన్ల జనాభా ప్రభావితం అవుతున్నారు. శుక్రవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది చైనా ప్రభుత్వం. ఇదిలా ఉంటే హీట్ వేవ్ కారణంగా చైనా మునుపెన్నడు లేని విధంగా విద్యుత్ కోతలను చవిచూస్తోంది. చాలా ప్రాంతాల్లో పరిశ్రమలకు విద్యుత్ కట్ చేశారు. ఉష్ణోగ్రతల కారణంగా ఏసీల వాడకం పెరగడంతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది.
మరోవైపు యూరప్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. కరువు అంచున యూరప్ దేశాలు ఉన్నాయి. బ్రిటన్ తో పాటు పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయి నదులు ఎండుకు పోతున్నాయి. బ్రిటన్ లోని ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోయింది. దీంతో రానున్న కాలంలో యూరప్ కరువు బారిన పడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!