lightning Strikes: ఒడిశాలో స్కూల్ భవనంపై పిడుగుపాటు.. విద్యార్థులకు తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning struck the school..10 people were injured: భారీ వర్షాలు వరదలతో ఒడిశా రాష్ట్రం అల్లాడుతోంది. పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచానా వేస్తోంది. ఇదిలా ఉంటే ఒడిశాలోని దియోగర్ జిల్లాలో పాఠశాలపై పిడుగు వేయడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
దియోనగర్ జిల్లా తిలేబాని బ్లాక్ పరిధిలోని పుతురపాసి ప్రాథమిక పాఠశాలతో 17 మంది విద్యార్థులు ఉండగా..పాఠశాల గదిపై పిడుగు పడింది. దీంతో 10 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటు కారణంగా విద్యార్థులు కాలిన గాయాలకు గురయ్యారు. పిడుగు ప్రభావానికి విద్యార్థులు ఉన్న స్కూల్ బిల్డింగ్ కు రంధ్రం పడి, పై కప్పు నేలపై పడింది. పిడుగు పడే సమయంలో భారీగా వర్షం కురువడంతో విద్యార్థులంతా స్కూల్ గదిలోనే ఉన్నారు. గాయపడిన విద్యార్థులంతా మూడు, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులే.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also: China: కరువు కోరల్లో చైనా.. “జాతీయ కరువు హెచ్చరిక” జారీ
పిడుగుపాటుకు గురైన వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశామని..10 మంది విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అందులో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద్ బెహెరా తెలిపారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థుల అవయవాలు సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కటక్ లో 55 ఏళ్ల రైతు తన పొలం దగ్గర ఉండగా పిడుగుపాటుకు గురై మరణించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.
ఈశాన్య, తూర్పు-మధ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలను అనుకుని ఉన్న ప్రాంతాలపై ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అల్పపడనం బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కియోంజర్,మయూర్భంజ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!