LG VK Saxena: ఢిల్లీలో లక్షలాది మంది నరకం అనుభవిస్తున్నారు.. ముందు వీటిపై దృష్టి పెట్టండి
- కొత్తగా ఎన్నికకానున్న సీఎంకు పని అప్పగించిన లెఫ్టినెంట్ గవర్నర్
- అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్
- అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కోరిన వీకే సక్సేనా
- పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారు- లెఫ్టినెంట్ గవర్నర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఎల్జీ పేర్కొన్నారు. మొత్తం 28 ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు.
Read Also: Amit Shah: ‘కాంగ్రెస్- పాకిస్థాన్ల ఉద్దేశాలు.. ఎజెండా ఒక్కటే’
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పశ్చిమ ఢిల్లీలోని లక్షలాది మంది ప్రజలు నరకం కంటే అధ్వాన్నమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. రెండు అడుగుల గుంతలతో రోడ్లు తయారయ్యాయి. అవి మురుగునీటిలో మునిగిపోయాయి. కొన్ని రోజులుగా శుభ్రం చేయకపోవడంతో డ్రెయిన్లు నిండిపోయాయి. మురుగునీటితో దుర్వాసన, కుళ్ళిపోతున్న చెత్త, మురుగు కాలువలు, విష కీటకాలు, దోమలతో వందలాది మంది నిస్సహాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.’ అని వీకే సక్సేనా పేర్కొన్నారు. మరో పోస్ట్లో.. ‘ఇది నిన్న సాయంత్రం ముండ్కా, నంగ్లోయ్, రాణిఖేడా, రంహోలా, కరాలా, కంఝవాలా, రోహ్తక్ రోడ్ల తనిఖీ సమయంలో కనిపించింది. ఈ ప్రాంతాల ప్రజలు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకుంటున్నారు’ అని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఈ ప్రాంత వాసులు, ప్రజా సంఘాలు, ఎంపీపీ, కౌన్సిలర్ల నుంచి పలుమార్లు వినతులు రావడంతో నిన్న సంబంధిత శాఖల అధికారులతో తనిఖీలు చేసి తక్షణ సాయం అందించారు.
Read Also: Narayana Swamy: నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. వెళ్లాలనుకుంటే అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..!
నిన్న రాత్రి నుండి వ్యాధి నిర్ధారణ పనులు జరుగుతున్నాయి.. నివాసితుల సౌకర్యార్థం అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన ఓ చార్ట్ను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా చాలా సార్లు.. ప్రజల దయనీయ స్థితి, దాని పరిష్కారం గురించి గౌరవనీయులైన ముఖ్యమంత్రికి తెలియజేశాను. ఈ దిశగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి దృష్టికి మరొక్కసారి తీసుకెళ్తున్నాను.. వెంటనే దీనిపై దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నానని వీకే సక్సేనా తెలిపారు.
सरकार की उपेक्षा और संबंधित प्रशासनिक जड़ता के कारण पश्चिमी दिल्ली के लाखों लोग नरक से भी बदतर जिंदगी जीने को मजबूर हैं। pic.twitter.com/CAKwx6TEAn
— LG Delhi (@LtGovDelhi) September 19, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!