LG VK Saxena: ఢిల్లీలో లక్షలాది మంది నరకం అనుభవిస్తున్నారు.. ముందు వీటిపై దృష్టి పెట్టండి
- కొత్తగా ఎన్నికకానున్న సీఎంకు పని అప్పగించిన లెఫ్టినెంట్ గవర్నర్
- అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్
- అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కోరిన వీకే సక్సేనా
- పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారు- లెఫ్టినెంట్ గవర్నర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఎల్జీ పేర్కొన్నారు. మొత్తం 28 ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు.
Read Also: Amit Shah: ‘కాంగ్రెస్- పాకిస్థాన్ల ఉద్దేశాలు.. ఎజెండా ఒక్కటే’
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పశ్చిమ ఢిల్లీలోని లక్షలాది మంది ప్రజలు నరకం కంటే అధ్వాన్నమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. రెండు అడుగుల గుంతలతో రోడ్లు తయారయ్యాయి. అవి మురుగునీటిలో మునిగిపోయాయి. కొన్ని రోజులుగా శుభ్రం చేయకపోవడంతో డ్రెయిన్లు నిండిపోయాయి. మురుగునీటితో దుర్వాసన, కుళ్ళిపోతున్న చెత్త, మురుగు కాలువలు, విష కీటకాలు, దోమలతో వందలాది మంది నిస్సహాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.’ అని వీకే సక్సేనా పేర్కొన్నారు. మరో పోస్ట్లో.. ‘ఇది నిన్న సాయంత్రం ముండ్కా, నంగ్లోయ్, రాణిఖేడా, రంహోలా, కరాలా, కంఝవాలా, రోహ్తక్ రోడ్ల తనిఖీ సమయంలో కనిపించింది. ఈ ప్రాంతాల ప్రజలు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకుంటున్నారు’ అని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఈ ప్రాంత వాసులు, ప్రజా సంఘాలు, ఎంపీపీ, కౌన్సిలర్ల నుంచి పలుమార్లు వినతులు రావడంతో నిన్న సంబంధిత శాఖల అధికారులతో తనిఖీలు చేసి తక్షణ సాయం అందించారు.
Read Also: Narayana Swamy: నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. వెళ్లాలనుకుంటే అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..!
నిన్న రాత్రి నుండి వ్యాధి నిర్ధారణ పనులు జరుగుతున్నాయి.. నివాసితుల సౌకర్యార్థం అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన ఓ చార్ట్ను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కూడా చాలా సార్లు.. ప్రజల దయనీయ స్థితి, దాని పరిష్కారం గురించి గౌరవనీయులైన ముఖ్యమంత్రికి తెలియజేశాను. ఈ దిశగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి దృష్టికి మరొక్కసారి తీసుకెళ్తున్నాను.. వెంటనే దీనిపై దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నానని వీకే సక్సేనా తెలిపారు.
सरकार की उपेक्षा और संबंधित प्रशासनिक जड़ता के कारण पश्चिमी दिल्ली के लाखों लोग नरक से भी बदतर जिंदगी जीने को मजबूर हैं। pic.twitter.com/CAKwx6TEAn
— LG Delhi (@LtGovDelhi) September 19, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!