Narayana Swamy: నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. వెళ్లాలనుకుంటే అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..!
- మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు..
- ఓడిపోయిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేయకండి..
- వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడవకండి..
- ప్రతిరోజు జగన్ ను బాధపెట్టే పనులు చేయకండి..
- వెళ్లిపోయేవాళ్లు అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..
Narayana Swamy: మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఓడిపోయిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేయకండి, వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడవకండి అని సూచించారు.. చాలామంది మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు.. ఇక, ప్రతిరోజు జగన్ ను బాధపెట్టే పనులు చేయకండి.. వెళ్లిపోయేవాళ్లు అందరూ ఇప్పుడే వెళ్లిపోండి అని సలహా ఇచ్చారు.. పార్టీ నుండి ఎంత పెద్దవాళ్లు వెళ్లిపోయినా.. పార్టీకి ఎలాంటి నష్టం లేదు.. 40 శాతం ఓటర్లు జగన్కు ఉన్నారని వెల్లడించారు.. వెళ్లిపోయిన వారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి జగన్ చేర్చుకోకూడదన్నారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 175కి 175 స్థానాలు గెలిచే సత్తా వైఎస్ జగన్కు ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. 100 సీట్లు అభ్యర్థులను మార్చి ఓడిపోయామని పేర్కొన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
జంతువుల కొవ్వును లడ్డూలో వాడి ఉంటే అలా వాడిన వారి కాళ్లు చేతులు, నోరు పడిపోతాయి.. అదే అబద్ధమైతే చంద్రబాబుకు అదే గతి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణస్వామి.. వేంకటేశ్వర స్వామి వారి అలాంటివారిని శిక్షిస్తారు.. నేను చేసింది తప్పని చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో గెలిచి ఉంటే స్వామీ వారి లడ్డూపై చంద్రబాబు అలా మాట్లాడి ఉండడు.. ఈవీఎం ద్వారా గెలిచాడు కాబట్టే ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు.. మనిషిగా పుట్టిన వాడు ఎవడు ఇలా మాట్లాడడు. వయసు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడు.. జగన్ పై బురద చల్లడమైన లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నాడు.. స్వామివారి లడ్డూ గురించి తప్పుగా ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
తాజావార్తలు
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
-
IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!