Narayana Swamy: నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు.. వెళ్లాలనుకుంటే అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..!
- మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు..
- ఓడిపోయిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేయకండి..
- వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడవకండి..
- ప్రతిరోజు జగన్ ను బాధపెట్టే పనులు చేయకండి..
- వెళ్లిపోయేవాళ్లు అందరూ ఇప్పుడే వెళ్లిపోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayana Swamy: మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఓడిపోయిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేయకండి, వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడవకండి అని సూచించారు.. చాలామంది మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు.. ఇక, ప్రతిరోజు జగన్ ను బాధపెట్టే పనులు చేయకండి.. వెళ్లిపోయేవాళ్లు అందరూ ఇప్పుడే వెళ్లిపోండి అని సలహా ఇచ్చారు.. పార్టీ నుండి ఎంత పెద్దవాళ్లు వెళ్లిపోయినా.. పార్టీకి ఎలాంటి నష్టం లేదు.. 40 శాతం ఓటర్లు జగన్కు ఉన్నారని వెల్లడించారు.. వెళ్లిపోయిన వారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి జగన్ చేర్చుకోకూడదన్నారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 175కి 175 స్థానాలు గెలిచే సత్తా వైఎస్ జగన్కు ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. 100 సీట్లు అభ్యర్థులను మార్చి ఓడిపోయామని పేర్కొన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
జంతువుల కొవ్వును లడ్డూలో వాడి ఉంటే అలా వాడిన వారి కాళ్లు చేతులు, నోరు పడిపోతాయి.. అదే అబద్ధమైతే చంద్రబాబుకు అదే గతి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణస్వామి.. వేంకటేశ్వర స్వామి వారి అలాంటివారిని శిక్షిస్తారు.. నేను చేసింది తప్పని చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో గెలిచి ఉంటే స్వామీ వారి లడ్డూపై చంద్రబాబు అలా మాట్లాడి ఉండడు.. ఈవీఎం ద్వారా గెలిచాడు కాబట్టే ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు.. మనిషిగా పుట్టిన వాడు ఎవడు ఇలా మాట్లాడడు. వయసు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడు.. జగన్ పై బురద చల్లడమైన లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నాడు.. స్వామివారి లడ్డూ గురించి తప్పుగా ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
తాజావార్తలు
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!