Leopard Hulchul: రాజమండ్రి శివారులో చిరుత సంచారం.. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న అటవీ శాఖ!
- రాజమండ్రి శివారులో చిరుత సంచారం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచన
- అసత్య ప్రచారాలు..వదంతులు నమ్మొద్దని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard Hulchul: అదిగో చిరుత, ఇదిగో చిరుత అంటూ చిరుత సంచారం రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను భయాందోళన గురిచేస్తుంది. నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా. భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు . చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు ట్రాప్ కెమెరాలను, బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజమండ్రి శివారు దివాన్ చెరువు సమీపం ప్రాంతంలో ప్రజల భయం భయంగా గడుపుతున్నారు. పులి సంచారం చేస్తున్న ప్రాంతాలుగా భావిస్తున్న చోట దండోరా వేయించి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశారు. పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దివాన్చెరువు సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. లాలాచెరువు, దివాన్చెరువు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల సాయం.. సీఎం చంద్రబాబు అభినందనలు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
మరో వైపు.. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని.. ఎవరైనా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్.భరణి హెచ్చరించారు. చిరుత సంచారంపై సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫొటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్లను నమ్మి భయపడవద్దన్నారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో తమ ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రుళ్లు చీకటిగా వున్న ప్రాంతంలోనికి వెళ్ళవద్దన్నారు. ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా నివాసిత ప్రాంతాల్లో ప్రహారా కాస్తున్నారన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు లా అండ్ ఆర్డర్ పరిధిలోనికి వస్తాయని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు చూసినవారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!