Left Parties: ప్రొ.హరగోపాల్పై దేశద్రోహం కేసు బనాయించడం హాస్యాస్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Left Parties: ప్రొ.హరగోపాల్తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి. అలాంటి వ్యక్తికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహం కేసును బనాయించడాన్ని వామపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. తక్షణమే ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Tragedy: విషాదం.. అంత్యక్రియలకు వెళ్తుండగా కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
Also Read
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
ప్రొఫెసర్గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రిటైర్డ్ అయిన తరువాత కూడా ప్రా॥ హరగోపాల్ ప్రజాసేవలో వున్నారు. ఉపాధి, త్రాగునీరు, భూసమస్యలు, దళిత, గిరిజనులపై దాడులు తదితర అంశాలపై స్పందిస్తూ సమావేశాలు, సెమినార్లు పెదుతూ ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఆగష్టు 19న ములుగు జిల్లా తడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ 50 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు. ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో 44వ వ్యక్తిగా హరగోపాల్ పేరుతో నమోదు చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ సమావేశంలో చర్చించారనే నెపంతో 150 మందిపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని వామపక్షాలు ప్రకటనను విడుదల చేశాయి. ఉద్యమాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేశారని, డైరీలలో పేర్లు ఉన్నాయని దేశద్రోహం క్రింద కేసులు నమోదు చేయడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డాయి. సుప్రీం కోర్టు అభిశంసించిన దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ప్రొ॥ హరగోపా మరియు ఇతరులపై పెట్టిన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు ప్రభుత్వ ఈ చర్యను నిరసించాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Also Read: Ambati Rambabu: పోలవరంలో జరుగుతున్న విషయాలను దాచాల్సిన అవసరం లేదు..
హరగోపాల్, సంధ్య, విమలక్కలపై కేసులను ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశద్రోహం కేసు బనాయించడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు కూడా హరగోపాల్ గురించి తెలుసన్నారు. సమాజం కోసం పనిచేసే వారిపై కేసులు సరికాదన్నారు. ఇదిలా ఉండగా.. విశాఖ ఎంపీ కిడ్నాప్ వ్యవహారంపై ఆయన స్పందించారు. విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే భద్రత లేదంటూ మండిపడ్డారు. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన చోట సీఎం ఇల్లు కట్టుకుంటాడట అంటూ ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థ ఏపీలో నిర్వీర్యమయిపోయిందని ఆయన ఆరోపించారు. విశాఖలో కబ్జాలు జరుగుతున్నాయని అమిత్ షా అంటున్నారని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
తాజావార్తలు
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!