Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Laxman Said That Bcs Are Being Oppressed In Ap

Laxman: ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం మోదీ ఆలోచిస్తుంటారు..

Published Date :January 7, 2024 , 7:38 pm
By Rajesh Veeramalla
Laxman: ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం మోదీ ఆలోచిస్తుంటారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ చైతన్యం కొరవడిందని గుర్తించి బీసీలను కదిలించి న్యాయం చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను బానిసలుగా, నోరు లేని జీవులుగా మార్చేశారని మండిపడ్డారు. 50శాతం బీసీ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం కోసం కదలిరావాలి అని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హక్కుల సాధనకు ఎన్నికలను ఆయుధంగా మలుచుకోవాలని ఆయన తెలిపారు.

Purandeshwari: బీసీని దేశ ప్రధానిని చేయడం బీజేపీతోనే సాధ్యపడింది..

Also Read

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
  • Bengal Election: బెంగాల్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
  • NBK 112 : 'బాలయ్య-కొరటాల' మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
  • MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!

బీసీలు రాజకీయంగా ఒక అడుగు పైకి ఎక్కడానికి కృషి చేసిన ఘనత ఎన్టీఆర్ ది అని లక్ష్మణ్ అన్నారు. ఏపీలో బీసీల రిజర్వేషన్లు 20శాతం కుదించి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే పద్దతి ఉందని అన్నారు. బీసీలకు అన్యాయం చేసి పడిగాపులు పడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మత్స్యకారుల కోసం కేంద్రంలో ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ఘనత మోడీ సర్కారుకు దక్కుతుందని తెలిపారు. ఓట్ల కోసం ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి.. ఉచితాలకు మోసపోయే స్థితిలో బీసీలు లేరని లక్ష్మణ్ తెలిపారు. పస్తులు అయిన ఉంటారు కానీ.. బీసీలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం.. షేక్ హసీనా విజయం లాంఛనమే..

ఏపీ ముఖ్యమంత్రికి బీసీలకు ఎంబీసీలకు తేడా తెలియదని లక్ష్మణ్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సాధికారితే రాజకీయ అజెండాగా మారాలి అని అన్నారు. సంచార జాతులు, కులాలను గుర్తించ లేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. మరోవైపు.. తల్లి కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తే ఏపీలోని పిల్ల కాంగ్రెస్ అదే విధానం అవలంభిస్తోందని మండిపడ్డారు. కుల గణనకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇస్తే ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా.. బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం అని అన్నారు. తూర్పు కాపు, శిష్ఠ కర్ణాలు సహా ఉత్తరాంధ్రలో ఐదు కులాలకు త్వరలోనే EBC హోదా కల్పిస్తామని లక్ష్మణ్ తెలిపారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని పార్టీలను ఓడించాలి అని తెలిపారు. బీసీ అజెండానా.. ఎన్నికల జెండా కావాలా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ కోరారు. ఇక ప్రధాని మోదీ ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం ఆలోచిస్తుంటారని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BC Social Awareness Conference
  • BCs
  • bjp
  • jagan
  • laxman

తాజావార్తలు

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • Bengal Election: బెంగాల్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!

  • Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!

  • NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్

  • Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions