Hyderabad: అత్తాపూర్ అక్బర్ హిల్స్లో భూ కబ్జా.. 9 మంది రౌడీషీటర్లు అరెస్ట్
- అత్తాపూర్ అక్బర్ హిల్స్ లాండ్ కబ్జా
- అత్తాపూర్ లో 9మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు
- నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్న ముఠా
- కొద్దిరోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర
- ఒక తుపాకీ తల్వార్లు.. ఇనుప రాడ్లు స్వాధీనం.
హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్లో బోన్లలో కుక్కలు.. లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్లో రౌడీ ముఠా తిష్ఠ వేసింది. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో 500 గజాల ల్యాండ్ కబ్జా స్థలాన్ని రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు.
MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఎన్టీవీతో మాట్లాడారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో 500 గజాల ల్యాండ్ కబ్జా అయిందని.. 9 మంది కబ్జా రౌడీ ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 4 డెడ్లీ వేపన్స్ కత్తులు, ఒక ఎయిర్ పిస్టోల్, గొడ్డలి రాడ్లు, నకిలీ డాక్యుమెంట్స్ సీజ్ చేసామని తెలిపారు. అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్ల నేర ప్రమేయం పై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. రౌడీ గ్యాంగ్ సంబంధించి సమాచారం స్థానికుల ద్వారా సమాచారం తమకు అందిందని చెప్పారు. వెంటనే రైడ్ చేసి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇటీవలే గండిపేట్ బృందావన్ కాలనీ, శంషాబాద్ మీర్స్ బ్రదర్స్ ఫాంహౌస్, ఇప్పుడు అత్తాపూర్ అక్బర్ అలీ కాలనీ ల్యాండ్.. ముడు చోట్ల లాండ్ కబ్జా చేశారు ఈ ముఠా అని తెలిపారు. కొద్దిరోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉందని చెప్పారు.
Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్ ఒక మహిళ యజమానిగా తెలుస్తోందని డీసీపీ తెలిపారు. ఆమె ఎవరో తెలియదు.. ప్రస్తుతం మహిళ పొజిషన్లో లేదన్నారు. మహిళకు చెందిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కబ్జా చేశారని చెప్పారు. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని.. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!