Land Dispute : గుంటూరులో భూవివాదానికి రాజకీయరంగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో ఓ భూవివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాడేపల్లిలోని ఓ ప్రాంతంలో తమ భూమిలో నాగి రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశాడని , తమ పై దాడి చేశాడని కోటేశ్వరావు అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి అనే వ్యక్తిపై అతనికి మద్దతు ఇస్తున్న వారిపై కోటేశ్వరరావు రాజకీయంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని పొలకం పాడులో ఓ భూ వివాదం టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల పోరుగా మారుతోంది. తాడేపల్లి ప్రాంతానికి చెందిన కోటేశ్వర రావు, శ్రీనివాస రావు అన్నదమ్ములు. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఏడు సెంట్ల స్థలంలో అన్నదమ్ములు ఇద్దరికీ వాటా ఉంది. అయితే ఇందులో శ్రీనివాస్ రావ్ అనే వ్యక్తి నాగిరెడ్డి అనే వ్యక్తికి స్థలం అమ్మేశాడనీ మిగిలిన భాగం కోటేశ్వర రావు పేరుతో ఉంది. అయితే తమ్ముడు శ్రీనివాసరావును భూమి అమ్మడానికి వీలు లేదని అన్న కోటేశ్వరరావు చెప్పడంతో కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ఈ వివాదాల నేపథ్యంలో నాగి రెడ్డి అనే వ్యక్తి తమ ఇంటిపై దౌర్జన్యానికి వచ్చాడని, దాడి చేసి మమ్మల్ని కొట్టాడని కోటేశ్వర రావు ,అతని కుటుంబం ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడం… ఆ తర్వాత కోటేశ్వరరావు టిడిపి నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోయాయి. భూ యజమాని కోటేశ్వరరావు చేసిన ఆరోపణల పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ స్థానికులతో మాట్లాడారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జరిగిన విషయం పై మీడియాకి వివరణ ఇచ్చారు. నాగిరెడ్డి కొనుక్కున్న భూమి లోకి వెళ్లేందుకు వస్తుంటే కోటేశ్వరరావు అడ్డుకునే ప్రయత్నం చేశాడని, పైగా ఈ చిన్న భూ వివాదాన్ని పార్టీల వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కోటేశ్వరరావు అతని కుటుంబం చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తున్నారు. మొత్తంగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలకు వివాద వేదికగా మారింది. దీనిపై పోలీసులతో దర్యాప్తు చేయించి అసలు కారణాలు బయట పెడతానని అంటున్నారు ఎమ్మెల్యే ఆర్కే.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!