Lal Darwaza Bonalu: పచ్చి కుండపై రంగం భవిష్యవాణి, గావు పట్టే కార్యక్రమం!
- సింహవాహిని అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ
- నేడు సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు
- పచ్చి కుండపై రంగం భవిష్యవాణి
Lal Darwaza Bonalu 2025 Rangam and Gavu Patta Today: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు ఆదివారం బోనాలను సమర్పించారు. నిన్న ఘనంగా బోనాల సమర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం జరిగాయి. నేడు సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం తరువాత పచ్చి కుండపై రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పోతరాజుల గావు పట్టే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో పాటు ఘటాలు, పలహర బండ్ల ఊరేగింపు ఉంటాయి.
Also Read: Gutha Sukender Reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు.. రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి!
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
రంగం భవిష్యవాణి కార్యక్రమం సందర్భంగా లాల్ దర్వాజా ప్రధాన అర్చకులు కార్తికేయ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. ఉదయాన్నే మొదటి పూజ సువర్ణ పుష్పాలతో నిర్వహించాము. ఈ రోజు భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఈ భవిష్యవాణి వినడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అమ్మవారు, స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు అనంతరం ఉత్సవ విగ్రహాలను నదిలో నిమర్జనం చేయడంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి’ అని ప్రధాన అర్చకులు కార్తికేయ తెలిపారు.
రెండో రోజు కూడా భక్తులతో రద్దీగా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం కొనసాగుతోంది. సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మధ్యాహ్నం తరువాత జరిగే రంగం భవిష్యవాణి కార్యక్రమంలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. భవిష్యవాణి తరువాత ఘనంగా అమ్మవారి ఊరేగింపుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. పోతరాజుల విన్యాసాలు, వివిధ వేషధారణలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా అమ్మవారి ఊరేగింపు జరగనుంది.
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!