Gutha Sukender Reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు.. రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి!
- రాజకీయ నాయకుల భాషపై గుత్తా అసహనం
- రాజకీయాల్లో భాషా వ్యవహారం దిగజారింది
- మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలి
- ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gutha Sukender Reddy on Politicians Language: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాలని, మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో రాజకీయ నాయకుల భాషపై మాత్రమే కాదు ఉచిత పథకాలు, అవినీతి, బనకచర్ల ప్రాజెక్టు, సాగర్ ఎడమ కాలువ లాంటి తదితర విషయాలపై స్పందించారు. ‘ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుంది. అధికారుల అవినీతి పెరిగిపొయింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో పెరిగిన అవినీతిని నియంత్రించాలి’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
Also Read: Vana Mahotsavam 2025: పెట్రోల్ బంక్లలో ఫ్రీగా సీడ్ బాల్స్.. 18 కోట్ల మొక్కలు టార్గెట్!
‘దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకు పెరిగిపోతోంది. ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేతల మధ్య పరస్పర దాడులు సరికాదు. సభ బయట సభ్యుల మధ్య జరిగే దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సాగర్ ఎడమ కాలువ ద్వారా తాగు నీటిని ముందుగానే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!